జగన్ మట్టి కొట్టుకు పోవాలని అనుకోని.. మీరే మట్టి కొట్టుకు పోయినట్టు.. ఈరోజు జగన్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ మీరే కాలిపోవడం ఏంటయ్యా.. తెలుగు తమ్ముళ్ళు అంటూ ఫేసుబుక్ ఓ పోస్టు హల్ చల్ చేస్తుంది. ఎందుకు అంత వ్యతిరేకత అనుకుంటున్నారా ? నిజం అండి బాబు.. ఇది పచ్చి నిజం.                     

 

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒకటి వైరల్ అవుతూ ఉంటుంది... ఈరోజు అలానే.. పచ్చ తమ్ముళ్ళూ కాలిపోవడం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే..  జగన్ వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో తెలుగు దేశం పార్టీ నేతలు చేస్తున్న నిరసనలతో చిన్న అపశకునం జరిగింది..               

 

ఆ అపశకునమే ప్రస్తుతం వైసీపీ అభిమానుల పాలిట వరం అయ్యింది. నిన్న విజయావాడలో తెలుగుదేశం పార్టీ నేతలు నిరసనలు చేస్తూ.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దిష్టి బొమ్మ తగలపెట్టాలని పెట్రోల్ పోశారు. ఆ పెట్రోల్ కాస్త పొసే తెలుగు కార్యకర్తపైనే పడి అంటుకుంది. దీంతో ఆ న్యూస్ ఓ ప్రముఖ టీవీ ఛానల్లో వచ్చింది.             

 

ఆ వీడియోని కాస్త వైసీపీ అభిమానులు తీసి వాళ్ళ ఫేసుబుక్ పేజీల్లో పోస్ట్ చేసుకుంటున్నారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆ వీడియో చుసిన వాళ్ళు అంత ఒకటే మాటా.. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు అని.. ఎందుకు ఆ నిరసనలు అని నెటిజన్లు మండిపడుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: