స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సినిమా అల వైకుంఠపుర ములో సినిమాలో నటించారు..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పై చిత్ర యూనిట్ భారీ అంచనాలు పెట్టుకున్నారు .. అది కూడా బన్నీ రెండేళ్లు గ్యాప్ తీసుకొని మరి చేస్తున్నా ఈ సినిమా అందరిలోనూ ఆశలు  రేపింది .. ఈ సినిమా కి సంబంధించిన టాక్ చాలా పాజిటివ్ గా నడుస్తోంది. ప్రతీ అంశం లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కావాల్సినంత జాగ్రత్త తీసుకుని ఒక మంచి ఎమోషనల్ డ్రామా ని వండి వార్చాడు.

 

 

ప్రేక్షకులు ఈ సినిమా ని థియేటర్ లలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. సరిలేరు కంటే ఎక్కువగా కామెడీ , ఎమోషన్ లూ ఉండడం తో సంక్రాంతి హిట్ ఇదే అంటున్నారు అందరూ .. అయితే ఈ సినిమా టైటిల్ , కథ విషయం లో కొన్ని డిస్కషన్ లు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.  పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది సినిమా ని గుర్తు తెచ్చుకుంటున్నారు చాలా మండి .  

 

 

అక్క‌డ‌ ప‌వ‌న్ అత్త ఇంటికి దారి వెతుక్కుంటూ వెళ‌తాడు. ఇక్క‌డ బ‌న్నీకి త‌న అమ్మ‌, నాన్న‌లు ఎవ‌రో తెలుసుకుని వాళ్ల‌కు ద‌గ్గ‌ర‌వ్వాల‌ని సేమ్ ప‌వ‌న్ లాగానే వాళ్ల ఇంట్లోకి దూర‌తాడు... చివ‌ర‌కు క‌థ సుఖాంత‌మ‌వుతుంది.. ఇంట‌ర్వెల్ టైంకు త‌న నాన్న అప్ప‌టి వ‌ర‌కు పెంచుతున్న ముర‌ళీశ‌ర్మ కాద‌ని జ‌య‌రాం అని తెలుస్తుంది అప్ప‌టి నుంచి ఆ ఫ్యామిలీకి ద‌గ్గ‌ర‌య్యేందుకు వాళ్ల ఇంట్లో జాబ్‌లో జాయిన్ అవుతాడు . ఆ తరవాత ఆ కుటుంబాన్ని మింగేయడం కోసం వచ్చిన ఒక విలన్ ని ఎదురుకోవడం అతని తో ఫైట్ లూ ఆఖరికి అతనే తమ కొడుకు అని ఆ పెద్ద ఇంటి వాళ్ళకి తెలిసిందా లేదా అనేది కథ !! 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: