చంద్రబాబునాయుడు ఆలోచనలు ఓ పట్టాన ఎవరికీ అర్ధంకావు.  ఐదేళ్ళ పరిపాలనలో రాష్ట్ర సంపదనంతా అమరావతికే దోచిపెట్టాడని, దోచి పెట్టడానికి కుట్ర  చేశాడని రాష్ట్రంలో జనాలు మండిపోతున్నారు. రాష్ట్ర సంపదనంతా అమరావతికి దోచిపెట్టటానికి ఎందుకు కుట్ర చేశారు ? ఎందుకంటే ఇన్ సైడర్ ట్రేడింగ్  పేరుతో రాజధాని నిర్మాణం ముసుగులో  వేలాది ఎకరాలను చంద్రబాబు, ఆయన బినామీలు, టిడిపి ప్రముఖులు, సన్నిహితులు కొనేశారు కాబట్టే.

 

అంటే రాష్ట్రంలోని సంపద మొత్తం ఇన్ సైడర్ ట్రేడింగ్ లో కొనేసిన భూముల విలువ పెరిగిపోవటానికే అమరావతిని డెవలప్ చేసేందుకు ప్రయత్నించాడన్న  విషయం అందరికీ అర్ధమైపోయింది. విచిత్రమేమిటంటే రాజధానిగా  అమరావతినే కంటిన్యు చేయాలని చేస్తున్న ఆందోన చేస్తున్న విషయం తెలిసిందే. ఆందోళనల విరాళం పేరుతో రాష్ట్రమంతటా భారీ విరాళాల సేకరణకు చంద్రబాబు తిరుగుతున్నారు.

 

అంటే రాష్ట్రమంతా తిరిగి సేకరిస్తున్న విరాళాలను కూడా మళ్ళీ అమరావతి కోసమే ఖర్చు చేస్తున్నారన్నమాట. అప్పుడు దోచిపెట్టింది అమరావతి కోసమే. ఇపుడు జనాలను నిలువు దోపిడి చేస్తున్నదీ మళ్ళీ అమరావతి కోసమే అనేది స్పష్టమైపోతోంది. అమరావతిపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతున్న విషయం కనబడుతున్నా  మళ్ళీ అదే అమరావతి కోసం పోరాటాల పేరుతో చంద్రబాబు విరాళాల సేకరణకు రాష్ట్రంలో పర్యటిస్తున్నారంటే ఆయన మానసిక పరిస్ధితి ఏంటో ఎవరికీ అర్ధం కావటంలేదు.

 

 ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే  అసలు అమరావతి కోసం రాష్ట్రమంతా విరాళాలు సేకరించాల్సిన అవసరం ఏమిటి ? ఏమిటంటే రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లోని ప్రజలు పెద్దగా సహకరించటం లేదు కాబట్టి. ఉండటానికి 29 గ్రామాలున్నా ఆందోళన మొత్తం కేవలం ఓ ఐదారు గ్రామాలకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. దాంతో విరాళాలు కూడా పెద్దగా రాలేదు. అందుకనే సేవ్ అమరావతి పేరుతో విరాళాలు సేకరించేందుకు చంద్రబాబు రాష్ట్రం మీద పడ్డాడు. విరాళాలు ఇస్తున్నది కూడా కమ్మోరు లేకపోతే టిడిపి వాళ్ళే అన్న ప్రచారం నిజమేనా ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: