గతంలో ఢిల్లీలో అతిఘోరమైన నిర్భయ అత్యాచార ఘటనకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అత్యంత కిరాతకమైన పనికి పాల్పడ్డ ఐదుగురిలో ఒకరు విచారం మధ్యలోనే చనిపోగా మిగిలిన నలుగురికి ఈనెల 22 తేదీన ఉరి శిక్ష విధించినట్లు కోర్టు వారు ప్రకటించారు. దీంతో యావత్ భారతదేశం హర్షించింది. అయితే ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం కోర్టు వారి వేసిన ఉరి శిక్షకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

 

నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో ఒక దోషి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసిన అందువలన జనవరి 22 తేదీన ఉరిశిక్ష అమలు చేయడం కుదరదని ఢిల్లీ హైకోర్టుకు ప్రభుత్వం స్పష్టం చేసింది. వారు చెప్పిన దాని ప్రకారం ఒక నిందితుని ఉరి శిక్ష పడినా కూడా కేసులో మెర్సీ పిటీషన్ కోసం ఆగాల్సి ఉంటుంది. అందుకే శిక్షను అములు చేయలేమని బుధవారం డిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

మరణ శిక్షరద్దుపై ముకేశ్‌, వినయ్‌ శర్మ పెట్టుకున్న క్యూరేటివ్‌ పిటిషన్‌ ముందుస్తుదని తెలిపింది. అనంతరం తదుపరి విచారణ మధ్యాహ్నానికి (భోజన విరామం తరువాత) వాయిదా పడింది.

 

2012 నిర్భయ కేసు లో నలుగురు దోషులు వినయ్ శర్మ (26), ముకేశ్‌ (32), అక్షయ్ కుమార్ సింగ్ (31), పవన్ గుప్తా (25) ఉరి శిక్ష జనవరి 22 అమలు చేయలేమని, ప్రభుత్వం, తీహార్ జైలు అధికారుల స్టాండింగ్ కౌన్సెల్ న్యాయవాది రాహుల్ మెహ్రా కోర్టుకు చెప్పారు. కేవలం దోషి పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్ధనను రాష్ట్రపతి తిరస్కరించిన తరువాతనే మరణ శిక్ష అమలుపై తుది నిర్ణయం వుంటుందని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: