జనసైనికులపై వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల దాడిపై జనసేనాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ...ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడకు వస్తా ... అక్కడే తేల్చుకుంటానని హెచ్చరిక చేశారు . అన్నట్టుగానే కాకినాడ చేరుకున్న పవన్ , జనసైనికులను పరామర్శించి , అధికార పార్టీ నేతలకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు . అయితే  పవన్ ఏమి చేసిన విమర్శలు చేసే కత్తి మహేష్ , జనసేనాని కాకినాడ పర్యటనపై కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు . ప్రభుత్వం తో తేల్చుకుంటా ... అది చేస్తా , ఇది చేస్తా అన్న పవన్ ఏమి చేశారని ప్రశ్నించారు .

 

ఇక అంతటి తో ఆగని కత్తి మహేష్ ... కాకినాడలో  పవన్ ఉగ్రరూపం చూసి నాలుగు అడుగులు వెనక్కి వెళ్లిన సముద్రం , నేలకు ఒంగిన ఆకాశం , పదిఅడుగులు కృంగిన భూమి, అమరావతి రాజధాని కోసం ఆమరణ నిరాహారదీక్ష చేపడుతున్న జనసేనాని అభినందలు అంటూ వరుస పోస్టులతో సోషల్ మీడియా లో రెచ్చిపోతున్నారు .  కాలుకు దెబ్బ తగిలి రక్తం కారుతున్న జనసైనికునిని పవన్ పరామర్శించిన ఫొటో సోషల్ మీడియా లో వైరల్ అవుతోన్న నేపధ్యం లో , ఆ ఫొటో పై కూడా కత్తి మహేష్ తనదైన శైలిలో పంచ్ లు వేశాడు .

 

పవర్ స్టార్ చెయ్యేస్తే ఆమాత్రం రక్తం కారదా? అంటూ ఎద్దేవా చేయడమే కాకుండా , గాయం ఆదివారం నాటిదైతేనేమి ఆదిమకాలం నాటిదైతేనేమి అంటూ అపహాస్యం చేశారు . కత్తి మహేష్ పోస్టులపై  పవర్ స్టార్ అభిమానులు , జనసైనికులు తీవ్రంగా మండిపడుతున్నారు . కత్తి మహేష్ కు పవర్ స్టార్ అభిమానులకు మొదటి నుంచి  వైరం కొనసాగుతున్న విషయం తెల్సిందే . పవన్ సినిమాల పై కత్తి మహేష్ సమీక్ష నచ్చని పవన్ అభిమానులు ఆయన్ని గతం లో  బండబూతులు తిడుతూ పోస్టులు చేశారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: