2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరమైన పరాజయాన్ని చవిచూసిన విషయం విధితమే. టీడీపీ ఆవిర్భావం తరువాత అంతటి పరాజయాన్ని చవిచూసింది జగన్ మోహన్ రెడ్డి చేతిలోనే. ఈ పరాజయం తరువాత సీనియర్ నేతలు అందరూ చంద్రబాబు పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారట. ఎందుకంటే..టీడీపీ అధికారంలో ఉండగానే వచ్చే ఎన్నికల్లో పరాజయం పాలవుతారని తెలిసి సీనియర్స్ అందరూ జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి తీసుకురావాలని పట్టుబట్టారట. కానీ చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తే ఎక్కడ లోకేష్ తగ్గిపోతాడో నని భయంతో ఎన్టీఆర్ ని పక్కన పెట్టేశాడట. కానీ చివరికి టీడీపీ ఈ ఎన్నికల్లో చీదేసింది..

 

ఎలాగో తెలంగాణాలో టీడీపీ నిలదొక్కుకునే అవకాశాలు లేవు కాబట్టి, ఏపీలో అయినా సరే టీడీపీని బ్రతికించుకోవాలని చంద్రబాబు తెగ ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే సంక్షేమ పధకాలతో సంతోషంగా ఉన్న ఏపీలో అమరావతి రాజధాని పేరు చెప్పి పబ్బం గడుపుతూ, జోలె పట్టుకుంటూ ప్రజల మెప్పు పొంది మరోసారి ప్రజలకి దగ్గర కావడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లోగా తనయుడు లోకేష్ పార్టీ సీఎం అభ్యర్ధిగా చేయాలని కలలుగంటుంటే..ఏపీలో టీడీపీ అభిమానులు కొందరు చంద్రబాబు లోకేష్ లకి షాక్ ఇస్తూ ఎన్టీఆర్ నెక్స్ట్ సీఎం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

 

అన్న ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన టీడీపీ ప్రభుత్వానికి తిరిగి పూర్వ వైభవం రావాలంటే తప్పకుండా జూ. ఎన్టీఆర్ సీఎం అవ్వాలని ముందు నుంచీ టీడీపీ సీనియర్స్, విశ్లేషకులు తమ అభిప్రాయాని తెలిపినట్టుగానే, ఇప్పుడు ఏపీలో టీడీపీ కార్యకర్తలు కూడా తమ అభిప్రాయాన్ని ఫ్లెక్సీల రూపంలో తెలుపుతున్నారు. ప్రకాశం జిలా యర్రగొండ పాలెం లో తెలుగుదేశం పార్టీ నేతలు ఓ  ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ నియోజకవర్గ ఇంజార్జ్ బూదాల అజిత్ రావుకి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ  రాబోయే కాలానికి కాబోయే సీఎం 2024 ముఖ్యమంత్రి  ఎన్టీఆర్ అంటూ క్యాప్క్షన్ పెట్టారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమరావతిలోనే రాజధాని అంటూ హడావిడి చేస్తున్న చంద్రబాబుకి ఇది కోలుకోలేని షాకే అంటున్నారు పరిశీలకులు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: