ఈమధ్య వాట్సాప్ వాడటం రోజురోజుకి పెరిగిపోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే వాట్సాప్ స్టేటస్ ఫీచర్ వచ్చినప్పటినుంచి నెటిజన్లు వాట్సాప్ స్టేటస్ పిచర్  ని బాగా ఉపయోగించుకుంటున్నారు. ఎవరికైనా ఏదైనా సందేశం ఇవ్వాలి అనుకుంటే ఇండైరెక్టుగా వాట్సాప్ స్టేటస్ లో పెట్టి సమాచారం అందిస్తారు. బాధలో ఉన్న వాట్సాప్ స్టేటస్ పెట్టేస్తున్నారు. సంతోషం లో ఉన్న వాట్సాప్ స్టేటస్ పెట్టేస్తున్నారు. మనం ఏ  సిచువేషన్ లో ఉన్న దానిని మిగతా వాళ్ళతో పంచుకోవడానికి వాట్సాప్ స్టేటస్ బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి వాట్సాప్ స్టేటస్ పెట్టారు... ఇంతకీ ఆ వ్యక్తి ఏమని  వాట్సాప్ స్టేటస్ పెట్టాడో  తెలిస్తే మాత్రం కావాల్సింది. 

 

 

 తాను చనిపోతున్నట్లు ముందుగానే వాట్సాప్ స్టేటస్ లో పెట్టి మరి ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ విషయం అందరికీ షాక్ కి గురిచేసింది. ఆ వ్యక్తి కుటుంబం రోడ్డున పడింది. హైదరాబాద్లోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే... సికింద్రాబాద్ పార్సి గుట్ట ప్రాంతానికి చెందిన రాము ఆటో డ్రైవర్... అతడికి భార్య రూత్ ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే  అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఇక వీరి మధ్య మనస్పర్ధలు రోజురోజుకూ ఎక్కువ అవుతూ గొడవలు కూడా ఎక్కువవుతుండడంతో ఆటో డ్రైవర్ రాము మనస్థాపానికి గురయ్యాడు. 

 

 

 బుధవారం అర్ధరాత్రి దాటాక భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తో మరోసారి గొడవ అయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన భర్త రాము... చనిపోయాడు. మనస్పర్ధలు కారణంగానే ఈ వ్యక్తి చనిపోయాడు అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టాడు రాము. అనంతరం ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ స్టేషన్ల మధ్య  రైల్వే ట్రాక్ పైకి చేరుకున్నాడు. దీంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా  ఆటో నడుపుతూ సంపాదించిన దాంతోనే జీవనం వెల్లదిసే  ఆ కుటుంబం ప్రస్తుతం రాము చనిపోవడంతో కుటుంబం మొత్తం రోడ్డున పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: