ఎప్పుడో నాలుగైదు వందల సంవత్సరాల క్రితమే బ్రహ్మంగారు కొన్ని విషయాలు చెప్పారు.  ఈ ప్రపంచంలో ఎన్నో విపరీతాలు చోటు చేసుకుంటాయని, ఆ విపరీతాల కారణంగా మనుషుల ప్రవర్తన వింతగా ఉంటుందని, మనిషిపై మనిషి అఘాయిత్యాలు చేస్తారని చెప్పిన సంగతి తెలిసిందే.  ఇక్కడ ఇప్పుడు అలానే జరుగుతున్నది.  చెప్పిన విధంగానే ప్రపంచంలో మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది.  మనిషిపై మనిషి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.  


ఇలా అఘాయిత్యాలకు పాల్పడటం వలన ఎన్ని ఇబ్బందులు వస్తాయో చెప్పక్కర్లేదు.  దాని నుంచి బయటపడేందుకు మనిషి ప్రయత్నం చేస్తున్నా కుదరడం లేదు.  ఇకపోతే, మహిళపైనే కాకుండా పురుషులపై కూడా లైంగిక దాడులు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి.  మగాళ్లను మగాళ్లు పెళ్లి చేసుకోవడం, ఆడవాళ్లను ఆడవాళ్ళూ పెళ్లిళ్లు చేసుకోవడం ఇటీవల కాలంలో కామన్ గా జరుగుతున్నది.  


దీని నుంచి బయటపడేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.  మగాళ్లను మగాళ్లు పెళ్లి చేసుకోవడం ఏంటి అని షాక్ అవుతున్నారా అక్కడికే వస్తున్నా... చాలా కాలంగా మగాళ్లు ఒంటరిగా ఉండటం ఒకటైతే, ఆడపిల్లలు తగ్గిపోవడం రెండోది. అయితే, కొంతమంది తమకు తెలియకుండానే ఆడపిల్లలు అనుకోని మగాళ్లను పెళ్లి చేసుకుంటున్నారు.  ఆ తరువాత తెలిసి షాక్ అవుతున్నారు.  ఇలాంటి సంఘటన ఒకటి ఇటీవలే కంపాలలో జరిగింది.  


ఉగాండాలోని కంపాలకు చెందిన మొహ్మద్ ముతాంబా అనే వ్యక్తికీ రెండు వారాల క్రితం పెళ్లి జరిగింది.  నిఖా పూర్తయ్యాక ఆ కార్యక్రమం జరగాల్సి ఉండగా, అమ్మాయి పీరియడ్స్ లో ఉన్నది చెప్పడంతో తప్పుకున్నారు.  పైగా ముతాంబాకు అనారోగ్యంగా ఉండటంతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు.  కట్ చేస్తే కొంతమంది స్నేహితుల ద్వారా తాను పెళ్లి చేసుకున్నది అబ్బాయిని అని తెలియడంతో షాక్ అయ్యారు.  పెళ్లి కూతురి గెటప్ లో వచ్చిన అబ్బాయి, పెళ్లి కొడుకు ఇంట్లోని విలువైన వస్తువులను దోచుకుపోయాడట. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: