అక్కినేని వారి కోడలు నాగచైతన్య సతీమణి సమంత కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు గ్లామర్ పాత్రల్లో మెరిసి తెలుగు ప్రేక్షకులను అలరించిన సమంత అక్కినేని నాగచైతన్య తో వివాహం తర్వాత తన పంథాని  మార్చుకుంది. ఇక అక్కినేని వారి కోడలు అయిన తర్వాత సమంత క్రేజ్ ఎక్కడికో వెళ్ళి పోయింది. అయితే పెళ్లి తర్వాత ఏ హీరోయిన్ కు కెరియర్ వుండదు అని ఉన్న  నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ పెళ్లి అయినా సక్సెస్ఫుల్ గా  టాప్ హీరోయిన్ గా దూసుకుపో వచ్చు అని నిరూపించింది అక్కినేని వారి కోడలు సమంత. నటనకు ప్రాధాన్యం ఉన్న కథలు ఎంచుకుంటూ వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ అమ్మడు. 

 

 

 ఓవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు స్టార్ హీరోల సరసన నటిస్తూ తన నటనతో అదరగొడుతుంది ఈ అమ్మడు. మరోవైపు ఫిట్నెస్ విషయంలో కూడా అందరికీ ఇన్స్పిరేషన్ గా నిలుస్తూ ఉంది. ఇప్పటికీ గత సంవత్సరం ఎన్నో సినిమాల్లో నటించి మంచి విజయాలను సొంతం చేసుకుంది అక్కినేని వారి కోడలు సమంత. ఇక కొన్ని రోజుల్లో తమిళ హిట్ మూవీ 96 తెలుగు రీమేక్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శర్వానంద్ సరసన నటించిన సమంత తన అద్భుతమైన నటనతో అలరించింది. కాగా  ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. 

 

 

 

 ఇకపోతే ప్రస్తుతం సమంత కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆర్ఎక్స్ 100 సినిమా దర్శకుడు అజయ్ భూపతి చేయబోయే మహాసముద్రం సినిమాకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నది . ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తన కథను సమంత కు వినిపించగా ఈ కథకు సమంతా నో చెప్పిందట. ఆ తర్వాత ఇదే కథను నాగచైతన్యకు వినిపించగా నాగచైతన్య కూడా ఈ కథకు నో చెప్పినట్లు సమాచారం. అయితే ఇదే కథను హీరో శర్వానంద్ కు వినిపించగా శర్వానంద్  ఈ కథను ఓకే చేశాడని. అయితే సర్వానంద్  ఓకే చేసి  సినిమాలో  నటిస్తున్నాడని తెలియగానే సమంతా ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సమంత శర్వానంద్ కలిసి ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో నటిస్తున్నారా  లేదా తెలియాలంటే మాత్రం అఫీషియల్ ప్రకటన రావాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: