ఈ మధ్యకాలంలో చంపడాలు.. చంపుకోడాలు ఎక్కువ అయిపోయాయి. రోజు రోజుకు మరి ఎక్కువ అయిపోతున్నాయి. ఇంకా భార్య భర్తల విషయంలో అయితే.. మనం రోజు చూస్తూనే ఉంటున్నాం. భార్యను చంపినా భర్త.. భర్తను చంపినా భార్య అని.. ఈ నేపథ్యంలోనే ఇలాంటి మరో ఘటనను మనం ఈరోజు చూడాల్సి వస్తుంది.     

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆరు నెలల క్రితమే ఓ జవాన్ పెళ్లి చేసుకున్నాడు... కానీ నేడు భార్యను ఏడుసార్లు కాల్చి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు ఎందుకు జరిగిందో.. భార్యపై ఎందుకు అంత కాసో తెలియలేదు.. కానీ ఏడు సార్లు కాల్చి అతను మరణించాడు. ఈ దారుణ ఘటన బీహార్‌లని సీతామర్హి పట్టణంలో చోటు చేసుకుంది.     

 

బీహార్‌లో చంద్రభూషణ్‌ అనే వ్యక్తి మధు అనే యువతిని ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత చంద్రభూషణ్ త్వరిత ప్రతిస్పందన బృందంలో జవానుగా సీతామర్హిలో విధులు నిర్వరిస్తున్నాడు. దీంతో భార్యతో కలిసి అక్కడే ఓ అద్దె ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నాడు.  

 

అయితే ఏమైందో తెలియదు కానీ ఆదివారం అంటే నిన్న ఒక్కసారిగా అతని ఇంట్లో నుండి కాల్పుల శబ్దం గట్టిగా వినిపించింది. దీంతో స్థానికులంతా వారి ఇంటి తలుపు తట్టగా ఎటువంటి స్పందనా రాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలకు ప్రవేశించిన స్థానికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. భార్య భర్తలు ఇద్దరు శవాలు అయ్యి కనిపించరు. భార్య మధుని గన్ తో కాల్చి తాను ఆత్యహత్యకు పాల్పడినట్టు పోలీసులు చెప్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.. మరి భార్యను భర్త అన్ని సార్లు ఎందుకు కాల్చాడో ఇప్పటికి తెలియటం లేదు!

మరింత సమాచారం తెలుసుకోండి: