యువరత్న నందమూరి బాలకృష్ణ అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికలతో పాటు మొన్నటి ఎన్నికల్లో కూడా ఆంధ్రలోని హిందూపూర్ నియోజకవర్గం నుండి ఎమ్యెల్యే గా ఎన్నికైన బాలయ్య, ఎప్పుడూ కూడా తన తోటి నటులు మరియు తోటి రాజకీయ నాయకులు, కార్యకర్తలతో కూడా సరదాగా ఉంటారని ఇప్పటికే పలువురు చెప్పడం జరిగింది. ఇక వైసిపి నగరి ఎమ్యెల్యే రోజా కూడా అటు రాజకీయాల్లో కొనసాగుతూ మధ్యలో వీలు కుదిరినప్పుడు అక్కడక్కడా సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. ఇక మొదటగా రోజా టిడిపి పార్టీ ద్వారానే రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది. అయితే టీడీపీలో కొన్నాళ్ళు ఉన్న రోజా, ఆ తరువాత కాంగ్రెస్ లో చేరి, 

 

కొన్నాళ్ల తరువాత అక్కడినుండి బయటకు వచ్చి, అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇక ఆ పార్టీ నుండి ఇప్పటికే రెండు సార్లు ఎమ్యెల్యేగా ఆమె గెలిచారు. ఇక వీటితో పాటు మరోవైపు పలు టివి షోల్లో కూడా ఎంతో ఎనర్జిటిక్ గా పని చేస్తున్న రోజాతో కలిసి బాలయ్య కొన్ని సినిమాల్లో నటించారు. మొదటి నుండి తనకు బాలయ్య అంటే రోజా కూడా పలుమార్లు ఇంటర్వ్యూ ల్లో కూడా చెప్పడం జరిగింది. ఇక నేడు ఆంధ్ర రాజధాని అమరావతిలో జరిగిన లెజిస్లేటివ్స్ మీటింగు లో భాగంగా టిడిపి లెజిస్లేటర్ బాలయ్యతో కలిసి అసెంబ్లీ లోపల రోజా సరదాగా రెండు సెల్ఫీ ఫోటోలు దిగారు. అయితే ఆ ఫొటోల్లో కొందరు ఇరు పార్టీల కార్యకర్తలతో పాటు టిడిపి అధినేత చంద్రబాబును కూడా గమనించవచ్చు. 

 

మొదటి నుండి టిడిపి, వైసిపి మధ్య రాజకీయంగా ఎన్నో విబేధాలు ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా పార్టీ నాయకులు, అలానే కార్యకర్తల మధ్య ఎటువంటి బేధాభిప్రాయాలు లేవు అని చెప్పడానికి నేడు రోజాతో కలిసి బాలయ్య ఎంతో సరదాగా దిగిన ఈ ఫోటోనే ఒక మంచి ఉదాహరణ అని కొందరు అంటున్నారు. ఇక కాసేపటి క్రితం బయటకొచ్చిన ఈ ఫోటో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. కాగా పలువురు బాలయ్య ఫ్యాన్స్ తో పాటు టీడీపీ, వైసిపి ఫ్యాన్స్, ఈ ఫోటోను షేర్స్, లైక్స్ చేస్తూ మరింత వైరల్ చేస్తున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: