ఈ సంక్రాంతి మహేష్ బాబుకు బాగా కలిసి వచ్చింది. సంక్రాంతి పండక్కు ఎలాగైనా మంచి సినిమా తీయాలని అనుకున్నారు. అనుకున్నట్టుగానే మంచి సినిమా చేశారు. సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సంక్రాంతి హిట్ లిస్ట్ లో మహేష్ నిలిచారు. సంక్రాంతి బాగా కలిసి వస్తుండటంతో నెక్స్ట్ కూడా సంక్రాంతికి రావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే మహేష్ బాబు మే నెల నుంచి కొత్త సినిమా మొదలుపెట్టబోతున్నారు. మహర్షి వంటి మంచి విజయం అందించిన వంశి పైడిపల్లితో సినిమా చేయడానికి సిద్ధం అయ్యాడు.
సంక్రాంతికి పండక్కు బెస్ట్ సినిమా అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తన 27 వ సినిమా అవకాశం వంశీకి అందించాడు. వంశి దర్శకత్వంలోనే సినిమా రాబోతున్నది. పండగ సినిమా అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వంశి పైడిపల్లి మహేష్ కోసం కథను రెడీ చేస్తున్నారు. మహర్షిని మించేలా కథ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికకే కొంతమేరకు కథ రెడీ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే మహేష్ కు కథ వినిపించి స్క్రిప్ట్ రెడీ చేస్తారట.
త్వరలోనే మహేష్ బాబు విదేశాలకు వెళ్ళబోతున్నారు. వచ్చిన తరువాత వంశి పైడిపల్లి సినిమా ఉంటుంది. ఆ సినిమా మొదలు పెట్టి ఫాస్ట్ గా పూర్తి చేస్తారట. డిసెంబర్ నాటికి సినిమా పూర్తి చేసి సంక్రాంతికి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది తన మ్యూజిక్ తో ఆకట్టుకున్న థమన్ ను ఈ సినిమా కోసం తీసుకుంటున్నారని సమాచారం. బిజినెస్ మెన్ సినిమాతో థమన్ కు అవకాశం ఇచ్చారు. ఆ సినిమా మ్యూజికల్ గా హిట్ కొట్టింది. తరువాత మరలా థమన్ తో సినిమా చేయలేదు.
థమన్ కు మొదటిసారి మహేష్ బాబు పెద్ద సినిమాకు అవకాశం అందించారు. ఇప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. బన్నీకి మంచి మ్యూజిక్ అందించినట్టుగానే, మహేష్ బాబుకు కూడా మంచి మ్యూజిక్ అందిస్తారాని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, థమన్ ను తీసుకుంటారు అని ఊహాగానాలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఇంకా ఏ విషయం కన్ఫర్మ్ కాలేదు. ఎందుకంటే మహేష్ బాబు, దేవిశ్రీ కరెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాడు. మరి దేవిని కాదని థమన్ ను తీసుకుంటారా చూడాలి.