ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ తమ స్వప్రయోచనల కోసం ఎంతకైనా దిగజారతారనడానికి ఇదో చక్కని ఉదాహరణ. తాజాగా వెలుగు చూసిన సంఘటనను పక్కన పెడితే. రాజధాని అమరావతి భూములను కాపాడుకోవడం కోసం దానిని అందరి సమస్యగా చేసిన చేస్తున్న పరిణామాలను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే చివరికి చట్టబద్ధమైన శాసన మండలి చైర్మన్ ను సైతం పక్కదారి పట్టించిన ఘనులు టిడిపి వర్గాలు. ఈ నేపథ్యంలోనే విశాఖ ప్రాంతంలో తెలుగు తమ్ముడు వ్యవహార సరళి అందర్నీ విస్మయానికి గురిచేస్తుంది. దిశ లాంటి చట్టం ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చినా, కామాంధుల్లో మాత్రం భయం కనిపించడం లేదు. అందులోనూ ఇంకా అధికారంలోనే ఉన్నామనే ధీమాతో మరింత దిగజరిపోతున్నారు.

తెలుగుదేశం నేతలు. అందుకు నిదర్శనమే విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజక వర్గం గోలుగొండ పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన ఘటన. కాటికి కాలు చాపే వయస్సులో సాధరణంగా ఏ వ్యక్తి అయినా రామ.... కృష్ణా ... అనుకోవడం సహజం. కానీ ఆ నేత రూటే వేరు...తన ఇంటి సమీపంలొనే నివాసం ఉంటున్న మహిళను లైంగిక వాంఛ తీర్చమంటాడు. ససేమిరా...అంటే....ఆమె భూ సమస్య పరిష్కారం కాదట. పశువాంఛ తో రగిలిపోతున్న కామాంధుడు...తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు గా,మండల పరిషత్ అధ్యక్షులుగా, నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ గా వ్యవహరించిన అప్పలనాయుడు.

.కొంత కాలం గా గోలుగొండ శివారు కొత్త జోగి0పేట లో తన ఇంటి ఎదురుగా నివసిస్తున్న మహిళను, భర్త ఇంట్లో లేని సమయంలో  లైంగికంగా వేధిస్తూ వస్తున్నాడు. ఆమె ఇంటి స్థల సమస్య పరిష్కారం కావాలంటే తన  కోరిక తీర్చాలంటూ తన పశువాంఛ ను ఆమె ముందుంచాడు. దీంతో కొంతకాలం సహనం తో ఓర్చుకున్న బాధితురాలు, అప్పటికే తెలుగుదేశం పార్టీ అధికారం లో ఉండటం తో నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. అయితే తాజాగా ఈ నెల 23 అర్ధరాత్రి పూటుగా తాగి వచ్చి ఆమె పై అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. అయితే గతములోనే అతని రెండో భార్యకు పిర్యాదు చేసినా... ఆ కమాంధునిలో మార్పు రాలేదు. దీంతో గోలుగొండ పోలీస్ స్టేషన్ లో అతని వికృత చేష్ట లు, లైంగిక వేధింపులపై బాధితురాలు పిర్యాదు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: