ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా యువతీ యువకులకు ప్రమాదకరంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఓ యువతి ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు అప్ లోడ్ చేసింది. ఓ యువకుడు ఫొటోస్ కి లైక్ లు కొడితే మురిసి పోయింది. మొబైల్ చాటింగ్ లతో మొదలైన పరిచయం ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకునే వరకూ వెళ్లింది. తర్వాత పరిచయం పెరిగి చనువుగా ఉండటం మొదలు పెట్టారు. ఇక ఆ తరువాత యువతిని మెల్లిగా లైన్ లోకి తెచ్చుకున్న యువకుడు కలిసి మాట్లాడుకుందాం.. రమ్మంటూ ఆమెను ఏకంగా లాడ్జికి తీసుకెళ్లాడు.
లాడ్జికి వెళ్ళాక ఆమెకు కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చి ఆమెను హత్యాచారం చేశాడు. ఆ యువతి మేల్కొని చూస్తే.. ఒంటి నిండా చెప్పరాని చోట్ల గాయాలవడంతో యువతి బోరుమంది. కథనం ప్రకారం.. ఈ దారుణ ఘటన ఆగ్రాలో జరిగింది. ఉత్తర ప్రదేశ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. హత్రాస్ జిల్లాకు చెందిన దర్శ్ గౌతమ్ అనే 23 ఏళ్ల యువకుడు ఏవియేషన్ డిప్లొమా చదువుతున్నాడు. అతనికి ఇన్ స్టాగ్రామ్ లో 20 ఏళ్ల యువతితో పరిచయమైంది. ఇన్ స్టాగ్రామ్ లో తన ఫొటోలకు లైక్ లు కొడుతుండడంతో యువతి మురిసిపోయింది.
ఇలా రోజూ ఫోన్ చేసి మాట్లాడుకునే స్థాయికి చేరింది. పరిమితికి మించి మాట్లాడుకుని పక్కదారి పట్టారు. ఓ రోజు గౌతమ్ ఫోన్ చేసి మాట్లాడుకుందాం రమ్మనడంతో యువతి అతనిని కలిసేందుకు వెళ్లింది. యువతిని ఏకంగా లాడ్జిని తీసుకెళ్లిన గౌతమ్.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
లాడ్జికి తీసుకెళ్లిన తరువాత కూల్ డ్రింక్ ఇచ్చాడని.. అనంతరం లేచి చూస్తే మర్మాంగాల పై గాయాలయ్యాయని బాధితురాలు వాపోయింది. కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి ఇచ్చి మత్తులోకి జారుకున్నాక దారుణంగా రేప్ చేశాడని ఆరోపించింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పెళ్లి వేడుకల్లో ఎంజాయ్ చేస్తున్న నిందితుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.