పౌరసరఫరాలశాఖపై సీఎం వైయస్.జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. శుక్రవారం తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన సీఎం వై ఎస్ జగన్. పౌరసరఫరాల శాఖమంత్రి కొడాలి వెంకటేశ్వర రావు(నాని), సీనియర్ అధికారులు హాజరయ్యారు. ప్యాక్ చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీని అన్నిజిల్లాల్లో అమలు చేయడంపై సీఎం సమీక్ష. జిల్లాల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన బియ్యం, నిల్వలపై వివరాలు అందించిన అధికారులు.
నాణ్యమైన బియ్యం సరఫరాకు 26.63 లక్షల టన్నులు అవసరం కాగా, ఖరీఫ్లో, రబీలో పంట ద్వారా 28.74 లక్షల టన్నులు అందుబాటులో ఉందని తెలిపిన అధికారులు. వివిధ జిల్లాల్లో సేకరించిన నాణ్యమైన బియ్యం నమూనాలను సీఎంకు చూపించిన అధికారులు. శ్రీకాకుళం, తూ.గో, ప.గో, కృష్ణా, గుంటూరు, కడప జిల్లాల్లో సేకరించిన నాణ్యమైన బియ్యం నమూనాలను పరిశీలించిన సీఎం.
ఏప్రిల్ 1 నుంచి అన్ని జిల్లాల్లో నాణ్యమైన బియ్యం పంపిణీ ప్రారంభం.
ఏప్రిల్ నుంచి జిల్లాకో నియోజకవర్గం చొప్పున ప్యాక్ చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీ. ఏప్రిల్ 1 నాటికి 22 నియోజకవర్గాలు, మే నాటికి 46 నియోజకవర్గాలు, జూన్ నాటికి 70 నియోజకవర్గాలు, జులై నాటికి 106, ఆగస్టు నాటికి 175 నియోజకవర్గాల్లో ప్యాక్ చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీ
నాణ్యమైన బియ్యం పంపిణీ కోసం 30 చోట్ల 99 నాణ్యమైన బియ్యం ప్యాకింగ్ యూనిట్లు. ఇందులో 41 సివిల్ సప్లైస్వి కాగా, మరో 58 చోట్ల పీపీపీ మోడల్లో ప్యాకేజ్డ్ యూనిట్లు. ప్రతి 30–40 కిలోమీటర్ల పరిధిలో ఒక ప్యాకేజీ యూనిట్
నెలకు 2వేల టన్నుల బియ్యాన్ని ప్యాకేజీ చేసే సామర్థ్యం. సత్వర పంపిణీ కోసం అందుకు తగ్గ సిబ్బంది, వాహనాలు ముందుగానే గుర్తింపు. పర్యావరణానికి హాని జరగకుండా బియ్యాన్ని ప్యాక్ చేయడానికి వాడుతున్న సంచులను తిరిగి సేకరించేలా చూడాలని సీఎం ఆదేశం.