ఏపీలో రోజు కోక కొత్త పథకాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అమలు చేస్తున్నారు. నవరత్నాల్లో భాగంగా జగన్ ఇచ్చిన హామీలన్నింటిని ఒక్కోక్కటిగా అమలు చేస్తున్నారు. తాజాగా మరో పథకాన్ని అమలు చేయబోతున్నారు. జగనన్న చేదోడు పేరుతో ఓ కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నాయీ బ్రహ్మణులకు, టైలర్లకు, రజకులకు ఆర్థిక సాయం అందించేందుకు జగనన్న చేదోడు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
త్వరలోనే పథకాన్ని ప్రారంభించేందుకు అనుగుణంగా అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ పథకం కింద నాయి బ్రాహ్మణులతో పాటు రజకులు, టైలర్లకు ఆర్ధిక సాయం అందించనున్నారు. అయితే.. త్వరలోనే జగనన్న చేదోడు పేరుతో ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. ఐదేళ్ల పాటు ప్రతీ యేడాదికి 10 వేల రూపాయాల చోప్పున నాయి బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఆర్ధిక సాయం అందించనున్నారు.
కాగా., ఇందుకు సంబంధించి వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. జగనన్న చేదోడులో భాగంగా ప్రభుత్వం నాయీ బ్రాహ్మణులు, టైలర్లు, రజకులకు ఆర్థిక సాయం అందించనున్నడంతో... ఆ విభాగాల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ల పాటు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణచించింది. అయితే.. ఇప్పటికే జగన్ సర్కార్ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది.
ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే పిల్లల తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి పథకం కింద రూ.15 వేలు జమ చేసింది. ఇప్పటికే తొలి విడత అమ్మ ఒడి డబ్బులు జమ చేసిన ప్రభుత్వం.. రెండోవిడత జమ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఆటోడ్రైవర్లకు ఏటా పది వేల రూపాయలు అందజేసింది. కేన్సర్ సహా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు పింఛన్లు అందజేస్తోంది. తాజాగా నాయీ బ్రాహ్మణులు, టైలర్లు, రజకుల వంటి చేతివృత్తుల వారికి చేయూతనిచ్చేందుకు జగనన్న చేదోడు పథకం అమలు చేసేందుకు సన్నద్ధమవుతోంది