మనిషికి కోపం వస్తే ఎలా ప్రవర్తిస్తాడో.. ఈ సంఘటనను చుస్తే అర్ధమవుతుంది. మనిషికి కోపం అనేది సహజం కానీ.. ఇంత కోపం ఉంటె ఇలా చేస్తామా..?? లేదా ఇలా అవుతుందా..? అనే ఆలోచన.., ప్రశ్న మనకి (చదివిన వారికి, చుసిన వారికి) తలెత్తుతుంది. పిచ్చి కోపంతో ఓ మనిషి పశువు కన్నా హీనంగా ప్రవర్తించాడు. జరిగిన ఈ ఘటనను చుస్తే.. ఆశ్చర్యానికి గురవక తప్పదు. వివరాల్లోకి వెళితే...
ఉత్తరప్రదేశ్ లో ఓ వ్యక్తి కుటుంబ తగాదాలతో శనివారం మధ్యాహ్నం భార్యతో గొడవపడిన రావత్ ఆమెను పదునైన కత్తితో పొడిచి చంపేశాడు. అయినా ఆవేశం చల్లారక ఆమె తలను వేరుచేసి దాన్ని చేత బట్టుకుని నడి రోడ్డు పై ఆమె తలతో 1.5 కిలోమీటరు మేరా నడుచుకుంటూ వెళ్లి ఉన్మాదిలా ప్రవర్తించాడు.
ఉత్తరప్రదేశ్ లోని జహంగిరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని బహదుర్ పురా గ్రామానికి చెందిన అకిలేశ్ రావత్ అనే వ్యక్తికి రెండు సంవత్సరాల క్రితం అదే ప్రాంతానికి చెందిన రజని అనే యువతితో వివాహమైంది. వీరికి ఓ పాప పుట్టి కొద్ది రోజులకే పాప అనారోగ్యంతో చనిపోయింది. ఇంక అప్పటి నుంచి దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యం లోనే శనివారం మధ్యాహ్నం రావత్, రజని మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది.
ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన రావత్ భార్యను ఇంట్లో నుంచి బయటకు లాగి పదునైన కత్తితో మెడ కోసేశాడు. అనంతరం శరీరం నుంచి తలను వేరుచేసి కిలోమీటరున్నర దూరం పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తిస్తూ నడుచుకుంటూ వెళ్లాడు. అతడి చూసి భయభ్రాంతులకు గురైన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని కదిర్పూర్ అనే గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. రావత్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.