కాకినాడలో కామంతో రగిలిపోయినా ఆటో డ్రైవర్ ..చిన్న పిల్ల అన్న జాలి కూడా లేకుండా అతి దారుణంగా ..ఛీ ..ఛీ
ఈ మధ్య కాలంలో ఆడపిల్లలకు సమాజంలో భద్రత అనేది లేకుండా పోయింది. పిల్లలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. బయటకు వెళ్ళిన అమ్మాయి ఇంటికి వచ్చేవరకు భరోసా ఉండడం లేదు. దీంతో కొంత మంది తల్లిదండ్రుల్లో ఆడపిల్లలను కనాలన్నా భయపడేవారు కూడా లేకపోలేదు. మరి ఇలాంటి పరిస్థితులు కేవలం మన భారతదేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. దీనికి తగిన శిక్షలు చట్టాలు ఎన్ని వచ్చినా కూడా ఆకతాయిల ఆగడాలకు మాత్రం ఎక్కడా బ్రేక్ పడడం లేదు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్ధం కాని పరిస్థితులు నెలకొంటున్నాయి. రోజు రోజుకి మానవతా విలువలు చచ్చిపోతున్నాయి. మనిషనేవాడు కనిపించడం లేదు.
ఇలాంటి ఘటనే ఒకటి కాకినాడలో చోటు చేసుకుంది. ఇటీవలె ఓ ఆటోడ్రైవర్ ఇలాంటి కీచక పనికి ఒడిగట్టాడు. ప్రేమ పేరుతో బాలికను నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరంలోని దుమ్ములపేటకి చెందిన మరుపల్లి దుర్గాప్రసాద్ 20 ఏళ్ళ యువకుడు ఆటో నడుపుతున్నాడు. దీంతో తరుచూ తన ఆటో ఎక్కేపదహారేళ్ళ బాలికతో మాటలు కలిపి దగ్గరయ్యాడు. ఆ మాయ మాటలకు పడిపోయిన ఆ అమాయకపు బాలిక అనుకోకుండా అత్యాచారానిక గురయింది. పెళ్లి చేసుకుంటానని కల్లబొల్లి కబుర్లు చెప్పడంతో ఆమె అతడితో చనువుగా ఉండడం మొదలు పెట్టింది.
దీంతో జనవరి 27వ తేదీన బాలికను ఆటోలో ఎక్కించుకుని ఎవ్వరూ లేని చోటుకి తీసుకెళ్లిన దుర్గాప్రసాద్ ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో ఈ విషయం ఎవరికైనా చెబితే పెళ్లి చేసుకోనని బెదిరించి బాలికను ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక ఆ అమ్మాయి నీరసంగా ఉండటంతో గమనించిన తల్లిదండ్రులు ఏం జరిగిందని ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. దీంతో వారు కాకినాడ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా. పోలీసులు కేసును నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.