ప్రస్తుతం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్‌ భారత్‌ తో పటు ఇతర దేశాలకు (24 దేశాలకు) వ్యాపిస్తోంది. తాజాగా ఈ వైరస్‌ కు సంబంధించి రెండో కేసు భారత్ లో నమోదైందనే సంగతి తెలిసిందే.. జనవరి 24న చైనా నుండి ఇండియాకు వచ్చిన ఒక వ్యక్తిలో ఈ వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం అతడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందజేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్‌ సోకిన వ్యక్తి ఇటీవల చైనాలో పర్యటించినట్లు డాక్టర్లు గుర్తించారు.


తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన కుటుంబం జనవరి 18 న  చైనా నుంచి భారత్ కు తిరిగి వచ్చారు. దీంతో చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపింది. వారు వుహాన్‌ కు 8 గంటల ప్రయాణ దూరంలో చైనాలో నివసించారు. కరోనా వైరస్ అనుమానంతో వైద్య పరీక్షల కోసం వారు తిరుపతి రుయా హాస్పిటల్‌ కు వచ్చారు. 


ఐసోలెటెడ్ వార్డులో వీరిని ఉంచి చికిత్స అందించాల్సింది పోయి.. డాక్టర్లు వారిని ఔట్ పేషెంట్ విభాగంలో పర్యవేక్షించి వదిలేశారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించడంలో హాస్పిటల్ వర్గాలు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అలసత్వం వహించాయి. ఈ విషయమై మీడియాలో కథనాలు రావడంతో జగన్ సర్కారు ఆరాతీసింది. వారికి వైద్య పరీక్షలు నిర్వహించక పోవడం, ఐసొలేటెడ్ వార్డులో చేర్చుకోకపోవడాన్ని సీరియస్‌గా తీసుకుంది. 


హాస్పిటల్ వర్గాలు, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తిరుపతి విమానాశ్రయంలో రెండు కరోనా స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అనుమానితులను నేరుగా విమానాశ్రయం నుంచి హాస్పిటల్‌ కు పంపించి ఐసొలేటెడ్ వార్డుల్లో చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: