ప్రపంచాన్ని కదిలించి వేస్తున్న సంఘఠన అంటే గుర్తొచ్చేది కరోనా.. ప్రాణాంతకరమైన ఈ వైరస్ సోకినా వెంటనే మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికే చాలామంది మరణించారు.చైనాలో దర్శనమిచ్చిన ఈ వైరస్ ఇప్పుడు దేశాలను మారుతూ వస్తుంది. రోజు రోజుకు కరోనా బారీన పడే వారి సంఖ్యా పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే 324 మందికి పైగా కరోనా వైరస్ సోకి మరణించారు. రెండు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఈ నేపథ్యంలో అలర్ట్ అయినా దేశాలు ఈ వైరస్ ను అరికట్టే దిశగా సాగుతున్నారు. ఈ మేరకు ఎక్కడ చుసిన కట్టు దిడ్డంగా చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో స్టాక్ మార్కెటులో కూడా నష్టాలు వాటిల్లాయని స్టాక్ ఎక్సచెంజ్ అధికారులు వెల్లడిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
అంతర్జాతీయ, ముఖ్యంగా ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. కరోనా వైరస్ భయాలు గ్లోబల్ మార్కెట్లను ఇంకా వణికిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం మరింత దిగజారి సెన్సెక్స్ 125 పాయింట్లు పతనమై 39633 వద్ద, 40 వేల దిగువకు చేరింది.అలాగే నిఫ్టీ 20 పాయింట్లు నష్టపోయి 11642 వద్ద కొనసాగుతున్నాయి. అయితే శనివారం దాదాపు 1000 పాయింట్లు పైగా కుప్పకూలిన నేపథ్యంలో షార్ట్ కవరింగ్ కారణంగా సూచీలు తిరిగి పుంజుకుని లాభాల్లోకి మళ్లే అవకాశం ఉందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఆటో, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ కంపెనీల షేర్లు నష్టపోతున్నాయి. గత ఏడాది సెప్టెంబరు మందగమనం నుంచి ఆటో మొబైల్ కంపెనీలు 3వ త్రైమాసికంలో క్రమంగా కోలుకుంటున్న ధోరణి కనిపించింది.
శనివారం నాటి ఫలితాల నేపథ్యంలో మారుతి, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్ బలహీనంగా ఉన్నాయి. ఏజీఆర్పై నేడు విచారణ నేపథ్యంలో భారతి ఎయిర్టెల్ నష్టపోతోంది. సిగరెట్ల ధరలు పుంజుకుంటాయన్న వార్తలతో ఐటీసీ భారీగా నష్టపోతోంది. అటు డాలరుతో పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి నష్టంతో 71.63 వద్ద ట్రేడింగ్ను ఆరంభించింది. ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. 2019 మే తర్వాత భారీగా తగ్గింది కేవలం మూడురోజుల్లోనే అంటూ వారు వెల్లడిస్తున్నారు.