బీజేపీ అధికార ప్రతినిధి ప్రముఖ న్యాయవాది అయిన రఘునందన్ రావు బిజెపి పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. బిజెపిలో కీలక నేతగా ఉన్న రఘునందన్ రావు... ఎప్పుడూ అధికార పార్టీ తీరును ఎండగడుతూ బిజెపి బలోపేతానికి కృషి చేస్తూ ఉంటారు. అయితే తాజాగా బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు పై ఓ మహిళా సంచలన ఆరోపణలు చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి అయిన రఘునందన్రావు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ మహిళ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ను  కలిసి వినతిపత్రాన్ని అందజేసింది. మెదక్ జిల్లా ఆర్సీపురం కు చెందిన రాధా రమణ తన భర్తతో విభేదాల కారణంగా 2013లో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే అడ్వకేట్ గా ఉన్నా బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు సలహా మేరకు తన భర్తపై మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసింది సదరు మహిళ. 

 

 

 అయితే ఈ క్రమంలోనే కేసు నిమిత్తం 2007లో అడ్వకేట్ రఘునందన్ రావు తనని ఓ రోజు ఆఫీస్ కి రమ్మని పిలిచారని.. ఆఫీసుకు వెళ్లిన తర్వాత కాఫీలో మత్తుమందు కలిపి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు చేసింది సదరు మహిళ. ఈ మేరకు బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక తనపై అత్యాచారం పాల్పడినప్పటి నుంచి అడ్వకేట్ రఘునందన్ రావు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించింది. తన వద్ద అశ్లీల చిత్రాలు ఉన్నాయి ఎవరికైనా చెబితే వాటిని సోషల్ మీడియాలో పెడతాను అంటూ రఘునందన్రావు బెదిరించి తనపై పలుమార్లు అత్యాచారం చేశారు అంటూ ఆరోపించింది సదరు మహిళ. కాగా ప్రస్తుతం ఆ మహిళ చేసిన ఆరోపణలు సంచలనం గా మారాయి. 

 

 

 అయితే ఈ విషయంపై ఇప్పటికే హెచ్ఆర్సీని ఆశ్రయించినట్లు తెలిపిన బాధిత మహిళ.. అడ్వకేట్ రఘునందన్ పై కేసు నమోదు చేయాలి అంటూ గత నెలలో ఆర్డర్  ఇచ్చినట్లు సదరు బాధిత మహిళ తెలిపింది. ఈ క్రమంలోనే తాజాగా సి పి సజ్జనార్ ను  కలిసిన బాధిత మహిళ... ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలి అంటూ సీపీ సజ్జనార్ ను కోరినట్లు వెల్లడించింది. కాగా న్యాయవాదిగా బీజేపీ అధికార ప్రతినిధి గా మంచి పేరు గుర్తింపు ఉన్న రఘునందన్రావు పై... ఇలాంటి ఆరోపణలు రావడం ప్రస్తుతం తెలంగాణ  రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే సదరు బాధిత మహిళ చేసిన ఆరోపణలపై ఇప్పటివరకు బీజేపీ అధికార ప్రతినిధి న్యాయవాది రఘునందన్రావు ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: