దేశంలో రోజురోజుకీ ఆడవాళ్లపై అత్యాచారాలు హత్యలు పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త చట్టాలు తీసుకు వస్తున్న గాని మగాడి ఆలోచనలో మార్పులు రావడం లేదు. దిశ మరియు నిర్భయ లాంటి ఘటనలు చోటు చేసుకున్న కొత్త కొత్త శిక్షలు వచ్చిన సమాజంలో మాత్రం ఆడవాళ్ళ పై దారుణాలు ఆగటం లేదు. తాజాగా ఓ లేడీ లెక్చరర్ పై పెట్రోల్ పోసి అతి దారుణంగా నిప్పంటించాడు ఓ కిరాతకుడు. మేటర్ లోకి వెళ్తే నాగ్‌పూర్ సమీపంలోని వార్ధా పట్టణానికి చెందిన యువతి(25) స్థానికంగా ఓ కాలేజీలో పని చేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన విక్కీ నగ్రారే ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట పడుతున్నాడు.

 

దాదాపు రెండు సంవత్సరాల పాటు ఆమె వెంట పడటం జరిగింది దీంతో ఆమె కనీసం పట్టించుకోకపోవడంతో కక్ష పెంచుకున్న విక్కీ...కాలేజీకి వెళ్తున్నావా యువతిపై పెట్రోల్ పోసి దారుణంగా నిప్పంటించారు. కాలేజీ కోసం బస్సు ఎక్కడానికి వెళ్తున్న యువతిపై ప్రేమోన్మాది బైక్ పై పెట్రోల్ చేసి ఆమెపై పోసి దారుణంగా నిప్పంటించారు. ఒక్కసారిగా మంటలు చెలరేగి పోయి మంటల్లో కాలిపోయిన యువతిని రక్షించే ప్రయత్నం స్థానికులు చేశారు. దీంతో వెంటనే పక్కనే ఉన్న నీళ్లను తీసుకుని ఆమెకై జల్లి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు.

 

దీంతో వెంటనే ఆమెను దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే దాదాపు 40 శాతం యువతి శరీరం కాలిపోవడం జరిగింది. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. అయితే పెట్రోల్ కోసిన ప్రేమోన్మాది కి ఆల్రెడీ పెళ్లి అయ్యి కొద్ది నెలల వయసున్న కొడుకు కూడా ఉన్నాడు అని తాజాగా పోలీసు విచారణలో బయట పడింది. పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించడంతో దారుణానికి ఒడిగట్టిన కిరాతకుని పట్టుకోవడానికి పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క ఈ ఘటన చూసిన స్థానికులు కాలిపోయిన ఆమె శరీరాన్ని చూసి భయ బ్రాంతులకు గురయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: