పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ  టీచరమ్మ , వారితోనే శారీరక సంబంధాన్ని పెట్టుకుని కోర్కెలు తీర్చుకుంటూ , భర్తకు అడ్డంగా దొరికిపోయింది . భర్త ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడనే సాకుతో , తన వద్ద చదువుకోవడానికి వచ్చిన విద్యార్ధులతోనే కామక్రీడలు కొనసాగించేది . ఈ విషయాన్ని తెలుసుకున్న భర్త పద్దతి మార్చుకోవాలని హెచ్చరించినా,  తన బుద్ధి మార్చుకోకపోవడం తో ...  మైనర్ లతో శారీరక సంబంధాలను కొనసాగిస్తున్నందుకు  సదరు టీచర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు .

 

వివరాల్లోకి వెళితే మలేసియా లోని ఓ 30  ఏళ్ల  టీచర్ స్థానిక పాఠశాలలో టీచర్ గా పని చేసేది . స్కూల్ ముగియగానే విద్యార్థులకు ట్యూషన్ చెబుతానని ఇంటికి పిలిపించుకునేది . వారిలో ఇద్దరితో తన శారీరక సుఖాలను తీర్చుకునేది . అంతటి తో ఆగని అమ్మడు , ఆ దృశ్యాలను తన ఫోన్ లో రికార్డు చేసి సదరు విద్యార్థులను బ్లాక్ మెయిల్ చేసేది .  ఒక రోజు  భర్త, ఆమె  ఫోన్ చెక్ చేయగా , అమ్మడి భాగోతం బయటపడింది . పద్దతి మార్చుకోవాలని భర్త హెచ్చరించగా , ఖాతరు చేయని సదరు పంతులమ్మ , అలాగే విద్యార్థులతో అక్రమ సంబంధాలను కొనసాగిస్తూ వచ్చింది . దాంతో విసిగిపోయిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు . భర్త చేసిన ఫిర్యాదు తో రంగం లోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు .

 

విచారణ లో నిజంగానే టీచరమ్మ , మైనర్ బాలురతో లైంగిక సంబంధాలను పెట్టుకున్నట్లు తేలింది . దానితో పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు .  ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లితండ్రులు షాక్ కు గురయ్యారు . తమ పిల్లలు ట్యూషన్ కు వెళ్లి బుద్ధిగా చదువుకుంటున్నారని అనుకున్నామని వాపోయారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: