అవునండి.. చూశారుగా.. ఆ దిష్టి బొమ్మ ఎవరిదో.. అసలు కథ ఏంటి అంటే.. వైసీపీ ప్రధాన కార్యదర్శి.. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నేడు ఓ సంచలన ట్విట్ పెట్టారు.. ఆ ట్విట్ ఏంటి అంటే.. ''తుఫాన్లను నియంత్రించగల అతీంద్రియ శక్తులు కలిగిన చంద్రబాబు నాయుడి వైపు ప్రపంచమంతా చూస్తోంది. కరోనా వైరస్ నుంచి రక్షించేందుకు ఆయన ఏదో ఒకటి చేయకపోతే భూమి మీద మనుషులు మిగలరని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా అంతా ఆందోళన చెందుతున్నారు!'' అంటూ వ్యంగ్యంగా ఓ ట్విట్ పెట్టారు. 

 

అంతే ఇంకా.. చంద్రబాబు నాయుడుపై నెటిజన్లు వారి మాటలతో వ్యంగ్యాస్థ్రాలు భారీ స్థాయిలో వేశారు అనుకోండి.. అసలు నెటిజన్లు చేసిన ట్విట్లు చూస్తే మీరు కూడా నవ్వు ఆపుకోలేరు.. గతంలో శ్రీకాకుళం జిల్లాలో తితిలి తుపాన్ వచ్చి జిల్లా అంత అతలాకుతమౌతుంటే అటువైపు గా వెళ్ళే బస్సుల పైన 'తుపానుపై విజయం సాధించాం' అంటూ పోస్టర్లు వేసి ప్రచారం చేసుకున్నారు. 

 

ఈ మేరకే ఇప్పుడు చంద్రబాబు పై జోకులు ఇలా వేస్తున్నారు.. ''బాబోరు ఏమి చెయ్యాల్సిన అవసరం లేదు.. జస్ట్ ఈ దిష్టి బొమ్మ ఒకటి పెడితే చాలు వైరస్ రాదు...తూఫాన్లు రావు'' అంటూ ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు స్పందిస్తూ.. ''అదే మా బాబు గారయితే దోమల మీద దండయాత్రలా.. కరోనా మీద కరాటే అని కొత్త పథకం పెట్టి ఒక 100 కోట్లు దొబ్బేసేవాడు'' అంటూ కామెంట్ పెట్టారు నెటిజన్లు.. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. మరి ఈ ట్విట్ పై చంద్రబాబు.. ఆ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: