వైసీపీ ప్రధాన కార్యదర్శి.. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రతిపక్షాలు చేసే చిల్లర కామెంట్లపై సోషల్ మీడియా వేధికగా ఫైర్ అవుతూ ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక విషయంపై ఫైర్ విజయసాయి రెడ్డి నేడు చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చూస్తే ఎవరైనా సరే నిజమే కదా.. బాబోరు ఇంతేకదా అని అనకుండా ఉండలేరు.. అలానే ఈరోజు చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు విజయసాయి రెడ్డి. 

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ.. ''మద్యం ధరలు పెంచినా ఆదాయం ఎందుకు పెరగడం లేదని చంద్రబాబు గోల పెడుతున్నాడు. బిజినెస్ మైండ్ కదా? ప్రతిదీ లాభనష్టాల కోణంలోనే చూస్తాడు. రేట్లు పెంచింది రాబడి కోసం కాదు బాబూ. తాగడం తగ్గించడం కోసం. సీఎం జగన్ గారు జిల్లాకో డీ-అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయించారు. మీరూ నిరభ్యంతరంగా చేరొచ్చు.'' అంటూ ట్విట్ చేశారు. 

 

దీంతో ఈ ట్విట్ చుసిన నెటిజన్లు.. అవును.. అయన బిజినెస్ మైండ్ ఏ.. అందుకే కదా.. ఎన్నికల్లో తరిమి కొట్టింది... సంచలన కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అయితే ఇంకా మండిపడుతున్నారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ''అంటే మీ ఉద్దేశ్యం ఏంటి బాబోరు తాగుబోతు అని మీ ఫీలింగ్ హా'' అంటూ కామెంట్ చేస్తున్నారు. దీంతో ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు.. ఈ ట్విట్ కారణంగా వైసీపీ.. టీడీపీ అభిమానుల మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: