టీడీపీ అధినేత చంద్రబాబుకు జైలు తప్పదట. ఎన్ని నాటకాలు వేసినా.. బీజేపీతో ఎంత దోస్తీ చేసినా చంద్రబాబు జైలుకెళ్లే రోజు త్వరలోనే ఉందట. ఈమాటలు అంటున్నది ఎవరో కాదు.. ఒకప్పటి ఆయన స్నేహితుడే.. ఇంతకీ ఎవరంటారా.. వైసీపీ నేత సీ రామచంద్రయ్య. ఊసరవెల్లి కంటే దారుణంగా రంగు మార్చే వ్యక్తి చంద్రబాబు.. రాజధాని పేరుతో కృత్రిమ ఉద్యమం సృష్టించి రైతులను కవచంలా వాడుకుంటున్నాడు.. గత ఐదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నాడు. చంద్రబాబు కచ్చితంగా జైలుకుపోతాడు.. దీంట్లో అనుమానమే లేదు అని వైసీపీ అధికార ప్రతినిధి సీ. రామచంద్రయ్య అంటున్నారు.

 

నలుగురు ఎంపీలను బీజేపీలోకి పంపించినంత మాత్రాన చంద్రబాబు తప్పించుకోలేడని సీ. రామచంద్రయ్య అన్నారు. చంద్రబాబు కృత్రిమ ఉద్యమాన్ని నమ్మి రైతులు మోసపోవద్దు అని సూచించారు. చంద్రబాబు ఆల్రెడీ సచ్చిపోయిన పాము అని, దాన్ని కొట్టాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం టీడీపీ వెంటిలేటర్‌పై ఉందన్నారు. పార్టీ ఉనికి కాపాడుకోవాలని చంద్రబాబు ఇలాంటి కృత్రియ ఉద్యమాలను సృష్టిస్తున్నాడన్నారు. చంద్రబాబు ఉచ్చులో రైతులు పడొద్దని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అమరావతి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటారని సీ. రామచంద్రయ్య అన్నారు.

 

ఆయన ఇంకా ఏమన్నారంటే.. “ రాజధానిని డిసైడ్‌ చేసి నోటిఫై చేస్తే రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదా..? ఇంత రహస్యానికి కారణం ఏంటీ.. ఆ అవసరం ఎందుకు వచ్చిందో చంద్రబాబు సమాధానం చెప్పాలి. పార్లమెంట్‌లో ఇచ్చిన రిప్లయ్‌లో.. 2015లో నోటిఫై చేశామని ఆ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు మినిస్టర్‌ చెప్పారు. 2015లో అమరావతి రాజధానిగా టీడీపీ నోటిఫై చేస్తే ఆ అంశాన్ని ఎందుకు దాచిపెట్టావు. “

 

"రాజధాని నోటిఫై చేసిన విషయం ప్రజలకు తెలియనివ్వకుంటే.. ఎన్ని నోటిఫికేషన్లు, ఎన్ని జీవోలు తెలియకుండా చేశావు చంద్రబాబూ.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఎప్పుడైనా రెఫరెండం పెట్టావా..? అమరావతిలో రాజధాని పెట్టడాన్ని గతంలో మేము వ్యతిరేకించాం. అప్పుడు రెఫరెండం పెట్టావా..? 2019లోనే చంద్రబాబుకు ప్రజలు రెఫరెండం ఇచ్చారు. లోకేష్‌ ఓడిపోవడం రెఫరెండం రిజల్ట్‌.. అని నిలదీశారు సీ ఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: