నేటితరం ప్రేమలు... ఎందుకు పుడుతున్నాయో... ఎందుకు విడిపోతున్నాయో  ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఒకప్పుడు ప్రేమలో ఎంతో మధురానుభూతి ఉండేది కానీ ఇప్పటి ప్రేమల్లో మాత్రం వావి  వరసలు మరిచి ప్రేమించుకుంటున్నారు. ఇక ఆ తర్వాత పెద్దలు పెళ్ళికి ఒప్పుకోరేమో అని భయం తో ప్రాణాలు వదిలేస్తున్నారు. పూర్తిగా  ఎదగక  ముందే చిన్నారుల గుండెల్లో నేటితరం ప్రేమలు చిగురిస్తున్నాయి. పూర్తిగా లోకాన్ని కూడా చూడకుండానే తనువు చాలిస్తున్నారు. ఇలా ఈ రోజుల్లో పెళ్లికి ఒప్పుకుంటారో లేదో అనే భయం తో ఆత్మహత్య చేసుకుని..  తనువు చాలిస్తున్నారు ప్రేమ జంటలు ఎన్నో. ఇలాంటి ఆత్మహత్యలు ఈ రోజుల్లో కోకొల్లలు. తాజాగా ఇలాంటి ఘటన జరిగింది ఇక్కడ. 

 

 

 ఎక్కడ తమ ప్రేమకి పెద్దవాళ్ళు విడదీస్తారు  అనే  భయంతో... ఇద్దరూ ఒకేసారి ఆత్మహత్య చేసుకుని చనిపోయారూ.ఈ  స్థానికంగా సంచలనం సృష్టించింది. వికారాబాద్ జిల్లా కామునిపల్లి కి చెందిన మమతా ప్రశాంత్... అక్క  తమ్ముళ్లు . వీరిద్దరూ వికారాబాద్లోని స్థానికంగా ఉండే ఓ డిగ్రీ కళాశాలలో ఓకే సంవత్సరం  చదువుతున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే కొంతకాలం పాటు ప్రేమించుకున్న ఇద్దరు ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని భావించారు... ఈ విషయాన్ని ఇంట్లో పెద్దలకు కూడా తెలిపారు. అయితే వీరిద్దరూ అన్నా చెల్లి వరుస కావడంతో... వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించడం కాదు గట్టిగా మందలించారు. అక్క తమ్ముడు ప్రేమించుకోవడం ఏమిటి అని... ఇవన్నీ మర్చిపోండి అంటూ మందలించారు.

 

 

 దీంతో మనస్తాపం చెందిన వీరిద్దరూ... ఎలాగూ కలిసి బ్రతకలేము కనీసం కలిసి చచ్చి పోదాము అని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇక ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని... దర్యాప్తు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: