నారా లోకేష్ లో సమస్యేమిటంటే తనను తాను చాలా పెద్ద మేధావిగా అనుకుంటుంటారు. వర్ధంతికి, జయంతికి కూడా తేడా తెలీని లోకేష్ కు ఉన్న అతిపెద్ద అర్హత ఏమిటంటే చంద్రబాబునాయుడు కొడుకు అవటమే. ఈ ఒక్క అర్హతతోనే చిన్న వయసులోనే పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అయిపోయారు. అదే సమయంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా అయిపోయారు. అదే ఊపులో దొడ్డిదోవన ఎంఎల్సీ అయిపోయి ఏకంగా మంత్రిగా కూడా బాధ్యతలు తీసేసుకున్నారు. ఇలాంటి లోకేష్ కు ఏమి మాట్లాడాలో కూడా తెలీదు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే అమరావతి పరిరక్షణ కోసం యుద్ధం జరుగుతోందట. ఈ యుద్ధంలో 5 కోట్లమంది ఆంధ్రులు ఒకవైపు తుగ్లక్ జగన్ గారు మరో వైపు ఉన్నారంటూ ట్వీట్ చేశారు. ఇక్కడే లోకేష్ మేధావితనం బయటపడిపోయింది. అదేమిటంటే నిజానికి అమరావతినే రాజధానిగా కంటిన్యు చేయాలనే డిమాండ్ వినిపిస్తున్నది కేవలం ఓ ఐదారు గ్రామాల్లో మాత్రమే. రాజధాని నిర్మాణానికి 29 గ్రామాల్లోని రైతులు భూములిస్తే  ఆందోళనలు మాత్రం కేవలం ఐదారు గ్రామాలకు మాత్రమే ఎందుకు పరిమితమైంది ?

 

ఇంతచిన్న లాజిక్ కూడా లోకేష్ కు అర్ధం కావటం లేదు. రాజధాని అమరావతిలో ఉన్నా విశాఖపట్నంకు వెళ్ళిపోయినా ఒకటే అని జనాలు ఫిక్సయిపోయారు. ఎందుకంటే చంద్రబాబునాయుడు పుణ్యమా అని అమరావతి మనందరి రాజధాని అనే భవన 13 జిల్లాల ప్రజల్లో ఎప్పుడూ కలగలేదు.

 

పోనీ అమరావతినే రాజధానిగా కంటిన్యు అవ్వాలనే డిమాండ్ తో గుంటూరు, కృష్ణా జిల్లాల జనాలు కూడా ఎందుకు ఆందోళన చేయటం లేదో లోకేష్ ఎప్పుడైనా ఆలోచించాడా ? ఏ విషయంపైనే లోతైన అవగాహన లేకుండానే  అమరావతి పరిరక్షణ కోసం 5 కోట్లమంది జనాలు ఒకవైపు పిచ్చి తుగ్లక్ జగన్ ఒకవైపంటూ ఏదో సినిమా పాటను పట్టుకుని ట్విట్టర్లో పెట్టేస్తే సరిపోతుందా ?  యుద్ధమని లోకేష్  అన్నాడు కానీ అది బయటా లేకపోతే ట్విట్టర్లోనా అన్నది చెప్పలేదు లేండి.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: