వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి తాజాగా నరసాపురం పార్లమెంటు సభ్యుడు వైసిపి పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు షాకింగ్ విషయాలు తెలియజేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి తో తనకున్న అనుబంధం వ్యక్తిగతంగా స్నేహం లాంటిదని చెప్పుకొచ్చారు. ఒక్కసారి జీవితంలో ఆయన తో కలిస్తే ఆయనను దగ్గరగా చూస్తే పొలిటికల్ లీడర్ కన్నా గొప్ప మానవతావాది కనిపిస్తారని తెలిపారు ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంకా ఆయన గురించి మాట్లాడుతూ వైయస్ దగ్గరగా ఉండే చాలా నేర్చుకున్నా అంటూ తెలిపారు.

 

నేపథ్యంలో యాంకర్ ప్రస్తుతం ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలలో వైయస్ ప్రకటించిన సంక్షేమ పథకాలను ప్రభావితం చేసే విధంగా ఏదైనా ఉందా అని రఘురామకృష్ణం రాజును ప్రశ్నించగా...జగన్ తన తండ్రి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని చూసుకుంటున్నారని కాకపోతే తాజాగా ఇటీవల ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం మాదిరిగా ప్రజలను కదిలించింది అని ప్రభావితం చేసిందని పేద పిల్లలకు వారి తల్లులకు జగన్ అమ్మ ఒడి పథకం ద్వారా అందించిన 15 వేల ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రజలకు తన తండ్రి పరిపాలన గుర్తుకు తెచ్చిందని తెలిపారు.

 

అంతేకాకుండా వైఎస్ ఎవరికైనా బాధ కలిగితే తన బాధగా భావిస్తారని...ఎవరైనా సంతోషపడితే తన సంతోషం లాగా ఆనంద పడతారని చెప్పుకొచ్చారు. అదే విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్ కూడా వ్యవహరిస్తున్నారని...తన తండ్రి మాదిరే తన పరిపాలన కూడా ఉండాలని భావిస్తున్నారని అద్భుతమైన సంక్షేమ పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పథకాల ద్వారా ప్రవేశ పెడుతున్నారని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. అంతేకాకుండా వైఎస్ బతికి ఉండి ఉంటే భారతీయ రాజకీయ చిత్రం వేరే లాగా ఉండేదని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: