రాజధాని అంశం రాష్ర్ట పరిధిలోని అంశం అని చంద్రబాబుకు తెలుసని వై ఎస్పా సిపి ఎమ్మెల్యే ర్టీ  ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. సిఎం వైయస్ జగన్మోహన్ రెడ్డితో రైతులు కలసి తమ సమస్యలు చెబితే వాటిపై కూడా విమర్శలా అని ప్రశ్నించారు. సిఎం  వైయస్ జగన్ తప్పకుండా రైతులకు న్యాయం చేస్తారని స్పష్టం చేశారు. ఏమీ తెలుసుకోకుండానే చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. గ్రామ స్దాయి నేతగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. చంద్రబాబు రోజురోజుకు దిగజారి మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు అమరావతి రైతులు ఎవరూ సహకరించ లేదన్నారు. 

పూలింగ్ అని చెప్పి చంద్రబాబు బలవంతపు భూసేకరణకు దిగారు. భూములు ఇచ్చిన రైతులకు చంద్రబాబు ఏం చేశారు. రైతులను పెయిడ్ ఆర్డిస్ట్ లని అనడం సరి కాదు. రాజధాని నిర్మాణానికి లక్షా ఆరు వేల ఎకరాలు అవసరమా అని నిలదీశారు. రైతు మిత్ర అని చెప్పుకునే చంద్రబాబు మంగళగిరిలో ఎందుకు పోటీ చేయలేదు. ఐదేళ్లుగా కౌలు పెంచమని రైతులు అడిగినా,రైతుకూలీల పెన్సన్ పెంచమన్నా చంద్రబాబు స్పందించలేదు. ఎవరూ అడగకపోయినా వైయస్ జగన్ కౌలు 15 ఏళ్లకు,పెన్సన్ లు ఐదువేలకు పెంచుతూ నిర్ణయం తీససుకున్నారు.

నేషనల్ హైవేను ఆనుకుని జయభేరి అపార్ట్ మెంట్స్ కట్టారు. ఈస్ట్ ఫేస్ లో రైతులు తమ భూముల్లో భవనాలు కడితే , జయభేరీ అపార్ట్ మెంట్స్ అమ్ముడుపోవని చంద్రబాబు భావించలేదా. స్దానికంగా 600 ఎకరాల రైతులకు అన్యాయం చేయలేదా. రాజధాని కోసం 8648 చదరపు కిలోమీటర్ల ఎకరాలు అవసరమా. రాజధాని రైతులకు అండగా మేం ఉంటాం. ఇన్ సైడర్ ట్రేడింగ్ కు సంబంధించి అందరి జాతకాలు బయటపడతాయి.

సిఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు తన పవర్ ను ఉపయోగించినా మంగళగిరిలో వార్డును గెలిపించుకోలేకపోయారు. అక్రమనిర్మాణంలో ఉన్న చంద్రబాబు ఎప్పుడైనా మంగళగిరి వచ్చారా. రైతులకోసం పనిచేసేవారైతే మీరు ముందు సమస్యలగురించి అక్కడ ఎంఎల్ ఏను,ఎంపీను,మంత్రిగారిని కలవండి.తర్వాత సిఎంగారిని కలవండి అక్కడకి సమస్యలు తీరకపోతే మీ నిర్ణయం మీరు తీసుకోండి. అధికారులను, పోలీసులను కూడా చంద్రబాబు బెదిరిస్తున్నారు.

ఉండవల్లి గ్రామంలో పేదలు అనేకమంది నివసిస్తున్నారు.ఫాగింగ్ ఎప్పుడూ వారికి చేయలేదు.చంద్రబాబు నివాసం ప్రాంతంలో ఫాగింగ్ కింద ఐదులక్షలు ఖర్చుపెట్టించారు. చంద్రబాబు ఇంటి వద్ద ఎల్ ఇ డి బల్బులు పెట్టించేేందుకు పంచాయితీనుంచి 50 లక్షల నిధులు డ్రా చేయించారు. చంద్రబాబు మంగళగిరి నుంచి పోటీచేస్తే ఆయన కూడా ఓడిపోయిఉండేవారు. లోకేష్ నామినేషన్లు సరిగాలేకపోయినా అధికారులపై వత్తిడి తెచ్చి ఓకే చేయించుకున్నారు. గుంటూరు లోక్ సభ పరిధిలో వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్దులను ఓడించేందుకు గుంటూరు కలెక్టర్ పై వత్తిడి తెచ్చారు. గత డిజిపి ఠాగూర్ ను కూడా చంద్రబాబు సొంత ప్రయోజనాలకు వాడుకున్నారు. చంద్రబాబు అబధ్దాలు భరించలేక తెనాలి సభ నుంచి ప్రజలు మధ్యలోనే వెళ్లిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: