ఏపీ టీడీపీ అధినేత, సర్వేల సీఎంగా గతంలో పేరు తెచ్చుకున్న చంద్రబాబుకు ఇప్పుడు అలాంటి సర్వే ఒకటి ఎసరు పెట్టింది. ప్రస్తుతం ఆయన చేస్తున్న ఆందోళనలు, ముఖ్యంగా రాజధాని అమరావతిని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వంటి పరిణామాలతో ఆయన రేటింగ్ పెరిగిందని, గత ఏడాది ఎన్నికల్లో టీడీపీ పార్టీ పరంగా అధినేత పరంగా ఆయన పోగొట్టుకున్న పరువు.. మర్యాదలు అన్నీ కూడా ఇప్పుడు ఆయన పో గు చేసుకున్నారని అనుకున్నారు. అయితే, తాజాగా ఆన్లైన్ సర్వే సంస్థ ఒకటి ఏపీలో విపక్ష నాయకుడిగా బాబు రేటింగ్ పై జరిపిన సర్వేలో ఓ సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది.
తమ సర్వేలో బాబు రేటింగ్ గతంలో కన్నా ఇప్పుడు మరీ దిగజారిందని ఈ సర్వే స్పష్టం చేసింది. రాజధా నిపై చంద్రబాబు చేసిన ఆందోళనలను ప్రజలు చాలా మేరకు విశ్వసించినా.. ఆయన కేంద్రాన్ని ఒప్పించ డంలోనూ కేంద్రం జోక్యం చేసుకునేలా వ్యవహరించడంలోనూ.. జగన్ దూకుడుకు ప్రధాన ప్రతిపక్ష నాయ కుడిగా కళ్లెం వేయడంలోనూ కూడా విఫలమయ్యారని సర్వే చెప్పింది.
ఇక, టీడీపీ నేతలను తనవైపు మళ్లించుకోవడంలోను, రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి ఉద్యమాన్ని తీసుకువెళ్లడంలోనూ బాబు పూర్తిగా విఫలమయ్యారని తేల్చింది. నిజానికి ఈ సర్వే.. ఎప్పుడు జరిగింది? అనేది ఇతమిత్థంగా తెలియకపోయినా.. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఈ సంస్థ తాజాగా కొన్ని లీకులు ఇచ్చి.. త్వరలోనే ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనుందని సమాచారం. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో ఉద్యమాలు చేస్తున్నవారిని లీడ్ చేయడంలో బాబు ముందున్నా.. నేను కాదు.. జేఏసీ అని చెప్పుకోవడంతో ఇది రాజకీయంగా ఆయన లబ్ధి చేకూర్చలేక పోయిందని సర్వే నిర్వహించిన వారు పేర్కొనడం గమనార్హం.
అంటే.. తాను అమరావతికే కట్టుబడి ఉం టే.. మిగిలిన ప్రాంతాల్లో తన పార్టీ దెబ్బతింటుందనే వ్యూహంతోనే బాబు ఇలా వ్యాఖ్యానిస్తున్నా.. అది ఆయనకు కలిసిరావడం లేదని పేర్కొంది. మొత్తంగా చూస్తే.. బాబు రేంటింగ్ ఫాల్ అయిందని అంటున్నారు హైదరాబాద్కు చెందిన పరిశీలకులు. ఈ సర్వే ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయని అంటున్నారు. మరి పూర్తి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.