జగన్ సర్కారు విద్యావ్యవస్థ ప్రక్షాళనకు నడుంబిగించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మర్చేసే లక్ష్యంతో అమ్మఒడి, నాడు- నేడు పథకాలు రూపొందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. పాఠశాలల్లో తొమ్మిది రకాల వసతుల కల్పన అంశంపై సీఎం వైయస్‌ జగన్‌ అధికారులతో చర్చించారు.

 

 

ఈ సందర్భంగా జగన్గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై... డిగ్రీ కళాశాలలకు కూడా నాడు నేడు కార్యక్రమం చేపట్టాలని సీఎం చెప్పారు. ఫేజ్ 2 కింద డిగ్రీ కళాశాలలు చేపడతాం...1100 కోట్లకు అంచనాలు వేశామని అయన అన్నారు. ఫేజ్ 1 పనులు 15 తేదీ లోపు పనులు ప్రారంభించి జూన్ లోపు పూర్తి చేయాలని సీఎం చెప్పారు. టెండర్లు మార్చ్ 31 లోపు పూర్తి చేస్తాం. ఫేజ్ 2, 3 లు హైబ్రిడ్ యాస్యూటి విధానంలో పనులు చేపడతామన్నారు.

 

 

జూన్, జులై లోపు ఫేజ్ 2, 3 పనులు కూడా ప్రారంభిస్తాం. ఫీజులు, నాణ్యత ప్రమానాలపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని మంత్రి సురేశ్ అన్నారు. ఫీజు రియంబర్స్ మెంట్ ఇబ్బంది లేకుండా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫీజు నియంత్రణ చేపడతాం. గోరు ముద్దలు కింద కొత్త మెనూ అమలులో నాలుగు అంచెల పర్యవేక్షణ వుంటుందని అయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: