కామంతో ఉన్న మగాళ్లు వావి వరుసలు మరిచి మరి రేప్ చేస్తున్నారు. మహిళలు చాలా మంది ఇప్పుడు ఎదుర్కొనే సమస్య ఇదే. బయట వాళ్ళు ఏదైనా చేస్తున్నారు అంటే అనుకోవచ్చు కానీ ఇంట్లో ఉండే వాళ్లా వల్లే సంరక్షణ లేకుండా పోతుంది. సొంత తండ్రి కూడా కామంతో చుస్తే పాపం ఆ ఆడపిల్ల ఎలా భరిస్తూ తన గోడును ఎవరితో వెళ్లబోస్తుంది. ఓ ప్రాంతంలో పుట్టింటికి వచ్చిన కూతురితో కిరాతకంగా ప్రవర్తించాడు ఓ కామాందుడు. 

 

 

కంటికి రెప్పలా కాచుకోవాల్సిన కన్నతండ్రే కూతురిని కాటేసిన దారుణ ఘటన జరిగింది. చేబ్రోలు మండలం మంచాలకు చెందిన యాకసిరి రామారావుకు ఒక్కగానొక్క కూతురు. రామారావు భార్య పదేళ్ల క్రితమే అనారోగ్యంతో చనిపోయింది. ఉన్న ఒక్క కూతరుకి వివాహం జరిపించి అత్తారింటికి పంపించాడు. కొద్దిరోజుల క్రితం ఆమె తండ్రిని చూసేందుకు పుట్టింటికి వచ్చింది.

 


నాలుగు రోజుల కిందట ఇంట్లో ఒంటరిగా ఉన్న కూతురిపై తండ్రి కామంతో రగిలిపోయాడు. బలవంతంగా లొంగదీసుకుని అత్యాచారం చేశాడు. ఈ మేరకు కూతురు ఫిర్యాదు చేయడంతో చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అఘాయిత్యానికి పాల్పడిన తండ్రి రామారావును అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు పోలీసులు. ఛీ ఛీ రక్తం పంచిన కన్న తండ్రి చేసిన పనికి సిగ్గుతో సభ్య సమాజానికి ఎం మెసేజ్ ఇస్తున్నాడా కామాందుడు అని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. 

 


తన భర్తకు ఈ విషయం తెలిస్తే తనని ఎక్కడ వదిలేస్తాడా అని ఆమె భయపడుతుంది. తండ్రి చేసిన పనికి సిగ్గుతో తల్లడిల్లుతుంది. కూతురిని కన్నతండ్రే కాటేసిన అమానుష ఘటన చోటుచేసుకుంది. పెళ్లై అత్తారింటికెళ్లిన కూతురు తండ్రిని చూసేందుకు పుట్టింటికి రావడమే ఆమె పాలిట శాపమైంది. తల్లి ఎప్పుడో చనిపోవడంతో తండ్రిని పలకరించేందుకు వచ్చిన కూతురిపై కామంతో కళ్లు మూసుకుపోయిన తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది... కేసు నమోదు చేసుకొని పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: