ఒకరితో పెళ్లిపీటలెక్కాడు మరొకరితో పాడికి మీదకు వెళ్ళాడు.. ఇదేంటి అనుకుంటున్నారా అవునండి మీరు విన్నది నిజమే.. ప్రేమ ఎంత మధురమైనది అని చాలామంది అనుకుంటారు కానీ కొన్ని సమస్యలను కూడా ఈ ప్రేమ తీసుకొస్తుంది. అందుకే కొందరి ఈ ప్రేమ  వల్ల మధురానుభూతులు పొందితే మరి కొంతమంది రిస్క్ లో పడతారు. అలానే ఇప్పుడు ఇద్దరమ్మాయిలు ప్రేమించాడు. 

 


అతని జీవితాగాదె ఈ స్టోరీ.. వివరాల్లోకి వెళితే... ఇద్దరమ్మాయిలను ప్రేమించిన ఓ యువకుడి కథ విషాదాంతమైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఉన్నా అతని బుద్ధి వక్రమార్గం పట్టింది. మరో యువతితో పీకల్లోతు ప్రేమలో పడ్డాడు. ప్రియురాలితో కలిసి ఉండలేక.. ఆమెను విడిచిపెట్టలేక ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలి కోసం భర్త సూసైడ్ చేసుకోవడంతో నమ్మివచ్చిన భార్య, ఏడు నెలల కొడుకు అనాథలుగా మిగిలారు. ఆ విషాద ఘటన తమిళనాడులో వెలుగుచూసింది.

 


ఇకపోతే పుత్తూర్ ప్రాంతానికి చెందిన రమేష్(31) కార్‌డ్రైవర్‌. సొంతంగా కారు కొనుక్కుని తిప్పుకుంటున్నాడు. తెన్నూరు ఇలాంతోప్పు ప్రాంతానికి చెందిన కావ్య(23)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఏడు నెలల వయసున్న కుమారుడు ఉన్నాడు. కారు బాడుగలకు వెళ్లే క్రమంలో రమేష్‌కి మరో యువతితో పరిచయమైంది.ఓ కాలేజీ అమ్మాయితో పరిచయం ఏర్పడింది.కొద్దిరోజుల్లోనే ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. తనకు పెళ్లైందన్న విషయాన్ని మరచిన రమేష్.. ఆమెతో ప్రేమాయణం సాగించాడు. శారీరకంగానూ దగ్గరైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రేమికులిద్దరూ కావేరి నది ఒడ్డున శవాలుగా కనిపించారు.

 


ఎందుకు వారిద్దరూ చనిపోయారు అనే వివరాలు పోలీసులకు తెలియడం లేదు.. బహుశా రమేష్, రీనా ఆత్మహత్యకు చేసుకోవడానికి కారణాలు తెలియరాలేదు. ఇద్దరి అక్రమ సంబంధాన్ని సమాజం ఒప్పుకోదని భావించి ఇద్దరూ తనువు చాలించాలని నిర్ణయించుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వారిద్దరి సంబంధం ఇళ్లలో తెలియడంతో అఘాయిత్యానికి పాల్పడ్డారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సూసైడ్ చేసుకుని చనిపోవడంతో ప్రేమించి మోసపోయానని ఆమె గమనించి పాపం బోరున ఏడుస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: