ఇప్పడు ప్రపంచం బాగా ముందుందని తెలిసిందే. ప్రపంచం మొత్తం మీద ఎం జరిగిన కూడా సెకన్లలో అందరికి తెలిసి పోతుంది. మరో విషయం ఏంటంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి వార్తా సెకన్లలో అందరికి చేరుతుంది. అది కూడా ఎంతంటే కొన్ని సెకన్లలో చేరిపోతుంది. ఇక పోతే వార్త ఛానెల్స్ ఐతే ఒక హైలెట్ న్యూస్ అయితే పదే పదేఅదే వార్తను ఫోకస్ చేస్తారు హైలెట్ చేస్తారు. ఒక చిన్న కూపీ పట్టుకొని పెద్ద గుట్టును ఛేదిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. 

 


ఈ వారం కు మీడియా హైలెట్ అయినా న్యూస్ ఏంటంటే.. సినిమాలు ఆలాగే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి మీడియా లో బాగా ఫెమస్ చేస్తుంది. అయితే ఈ వారం ప్రేక్షకులను అలరించిన సినిమాల విషయానికొస్తే జాను సినిమా బాగా ఫెమస్ అయింది.. సమంత సినిమా కాబట్టి ఈ సినిమాపై బాగా క్రేజ్ ను సంపాదించుకుంది. సినిమా పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకు  కూడా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. 

 


కరోనా వైరస్ : ప్రపంచాన్ని మొత్తం భయబ్రాంతులకు గురిచేసిన ఈ భయంకరమైన వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ వైరస్ బారిన పడి చాలా మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు.చైనాలో మొదలైన ఈ భయంకరమైన వైరస్ బారీన పడిన చాలా మంది అంటే 600 మందికి పైగా చనిపోయారు. పది హేడు వేల మంది చావు బారిన పడబోతున్నారు. ఇంకా కేరళ లో కూడా నాగులు కరోనా కేసులు బయటపడటంతో అందరు భయపడుతున్నారు. 

 


ఢిల్లీలో జరిగిన ఎన్నికలు .. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దేశాన్ని ఉత్కంఠకు గురిచేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, అప్, కాంగ్రెస్ పార్టీలతో సహా మరి కొన్ని పార్టీలు ఎన్నికల బరిలో దిగాయి. ఈ ఎన్నికల ప్రచారంలో చాలా మంది పోటా పోటీగా పాల్గొని ఎన్నికల జోరును సాగించారు. నిన్న ఈ ఎన్నికలు ఓటింగ్ ముగిసింది. అయితే ఈ ఎన్నికలు ఫలితాలు మరికొన్ని రోజుల్లో వెలువడనున్నాయి. ఇది ఈ వారం మీడియా బాగా ఫోకస్ చేసిన అంశాలు. మరో వారం మరికొన్ని  ఇంట్రెస్టింగ్ అంశాలను తెలుసుకుందాము.. 

మరింత సమాచారం తెలుసుకోండి: