కొన్ని కొన్ని సార్లు మరణం ఎటు  నుంచి వస్తుందో అసలు ఊహించ లేకుండా  ఉంటుంది. గాచారం సక్కగ  లేనప్పుడు దేవుడు కూడా ఏమీ చేయలేడు అని ఓ నానుడి ఇక్కడ జరిగిన సంఘటనకు సరిగ్గా సరిపోతుంది. ఓ వ్యక్తి అంత్యక్రియల కోసం వచ్చిన మరో వ్యక్తి మద్యం తాగుదామని అనుకున్నాడు. మద్యం తాగి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అప్పటికే ఓ వ్యక్తి మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి... ఇక ఆ వ్యక్తి అంత్యక్రియలకు వచ్చిన మరో వ్యక్తి మరణం తో... పూర్తిగా శోకసంద్రంలో మునిగిపోయింది ఆ కుటుంబం. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. 

 

 వివరాల్లోకి వెళితే.... కూతురు భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతని అంత్యక్రియలకు హాజరైన మామ కార్యక్రమాలన్నీ ముగిశాక మద్యం తాగాలని అనుకున్నాడు. పొరపాటున అల్లుడు పురుగుల మందు కలుపుకొని తాగిన మద్యం సీసా లోని మందే తాగడంతో ఆయన కూడా కన్నుమూయడం ఆ కుటుంబంలో తీరని లోటుగా మారిపోయింది. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్  మండలం పెద్ద తూండ్లకు   చెందిన పోలు రవి చిన్న కుమార్తెను కాటారం కు  చెందిన నాగరాజుకు మూడేళ్ల క్రితం ఇచ్చి వివాహం చేశాడు. నాగరాజు కు అప్పుల బాధ పెరగడంతో... తీవ్ర మనస్థాపం చెంది మద్యం లో పురుగుల మందు కలుపుకొని ఈ నెల 6న ఆత్మహత్యాయత్నం చేశాడు. 

 

 ఇది గమనించిన కుటుంబీకులు అతన్ని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరుసటిరోజు ఏడవ తేదీన మృతి చెందాడు. దీంతో రవి దంపతులు అల్లుడు నాగరాజు అంత్యక్రియల కోసం కాటరానికి  వచ్చారు. శుక్రవారం అంత్యక్రియలు ముగిశాక  మద్యం బాటిళ్లు తెచ్చుకుందామని వైన్స్  కు వెళ్లే క్రమంలో... అక్కడే ఉన్న బెడ్ రూమ్ లో మద్యం సీసా కనిపించింది. అది మామూలు మధ్యమే  అనుకొని తాగేసాడు. కానీ అది ఆత్మహత్య చేసుకోవడానికి మద్యం సీసాలు పురుగుల మందు కలిపి సగంతాగి సగం అక్కడ పెట్టాడు నాగరాజు. దీంతో పురుగుల మందు కలిపిన మధ్యాన్ని తాగాడు రవి. ఇక మందు తాగి  అస్వస్థతకు గురయ్యాడు రవి . ఇక కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మృతితో తన కుటుంబం మొత్తం కన్నీరుమున్నీరవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: