ఒకరితో ప్రేమ పుడితే అది చనిపోయిన తర్వాత కూడా అలానే ఉంటుంది. మన భాషల్లో చెప్పాలంటే మట్టిలో కలిసే వరకు ప్రేమ తగ్గదు అని అర్థం. సరిగ్గా ఇక్కడ ఇదే జరిగింది. ఓ భర్త భార్య మీద ప్రేమతో చనిపోయిన తర్వాత కూడా అతను ఆమె శవాన్ని పూడ్చకుండా పదహారేళ్లుగా శవం పక్కన పడుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తుంది. పెళ్లితో ఒక్కటయ్యే ఆ జంట నిండు నూరేళ్లు ఒకరికి ఒకరు తోడుగా జీవించాలని కోరుకుంటారు. 

 


ఈ క్రమంలో ఎన్ని కష్టాలొచ్చినా ఒకరి చేయి ఒకరు వీడమని ప్రమాణం చేస్తారు. కానీ, వాటిని తు.చా. తప్పకుండా పాటించే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే, వియత్నాంకు చెందిన ఆ వ్యక్తి మాత్రం అలా కాదు. భార్య చనిపోయినా సరే.. ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆమెను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేక.. ఆమె శవాన్ని తన పడక మీద పెట్టుకుని నిద్రిస్తున్నాడు.

 


సమాధి చేసిన తర్వాత కూడా అతను ఆమె సమాధిపై నిద్రిస్తూ వచ్చాడు. అలా తప్పు అని కొందరు నచ్చచెప్పగా ఆమె అస్థికలను ఏకంగా ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాడు. ఓ బొమ్మను చూసుకొని అందులో ఆమె అస్థికలను ఉంచుకొని పక్కన పడుకొని నిద్రించేవాడు. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు లీ తన భార్య అస్థికలను బొమ్మలో పెట్టుకుని నిద్రపోతున్నాడని, దాని వల్ల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 

దీంతో పోలీసులు అతడిని ఎలాగైనా ఒప్పించి.. ఆమె అస్థికలను తిరిగి స్మశానానికి చేర్చాలని ప్రయత్నించారు. కానీ, లీ అందుకు ఒప్పుకోలేదు. అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా లీ మొండితనం వీడలేదు. దీంతో పోలీసులు వెనకడుగు వేశారు. అతని ప్రేమను చుసిన ఎవరైనా కూడా కాదనరేమో. అయన రోజు ఆ బొమ్మకు దుస్తులు వేసేవాడని భార్యను ఎలా చూసుకుంటాడో అలా చేసుకుంటున్నాడని అందరు అంటున్నారు. ప్రస్తుతం వీడియో వైరల్ అవుతుంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: