ఆడపిల్లలు ఎప్పుడూ ఏదో ఒక విషయంలో మోసపోతూనే ఉంటున్నారు. రోజూ ఎన్ని అనర్ధాలు జరుగుతున్నప్పటికీ వారిలో ఒక అవగాహన మాత్రం రావడంలేదు. ఎవరిని పడితే వారిని నమ్మడం ఫోన్ నెంబర్లు ఇవ్వడం. చివరికి మోసపోవడం తర్వాత పోలీస్ స్టేషన్ల వెనుక తిరగడం ఇవన్నీ ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయాయి. మరి ఇలాంటి ఘటనే ఒకటే గుజరాత్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...కాలేజ్ కి వెళ్ళే ఓ యువతి తన స్నేహితురాళ్ళ ద్వారా ఓ వ్యాపారి పరిచయం అయ్యాడు. ఈ యువతి పై కన్నేసిన ఆ వ్యాపారి నిధానంగా మాటల్లో పెట్టి ఆమె ఫోన్ నెంబర్ని తీసుకున్నాడు. తర్వాత ఆమెతో రోజూ వాట్సాప్లో ఛాటింగ్ మొదలు పెట్టాడు.
నిధానంగా మాటల్లో పెట్టి ప్రేమిస్తున్నా.. పెళ్ళి చేసుకుంటా అంటూ నమ్మించసాగాడు. దాంతో పూర్తిగా అతని మాయలో పడిపోయింది ఈ యువతి. అందులోనూ కాస్త ఆస్తిపాస్తులున్న అబ్బాయి కావడంతో వెంటనే సరే అనేసింది. కొద్ది రోజులు ప్రేమాయణం సాగించిన తర్వాత వీరిద్దరు కలిసి రహస్యంగా ఓ గుడిలో పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత రోజు హోటల్లో రూమ్ బుక్ చేసి శోభనం కూడా కానిచ్చేశాడు. ప్రియురాలికి తెలియకుండానే అక్కడ సిసికెమెరాలు పెట్టి వీరి రాసలీలలను చిత్రీకరించాడు. ఆ తర్వాత ఆమెను పుట్టింటికి వెళ్ళమని నేను ఇంట్లో పెద్దవాళ్ళని ఒప్పించి ఇంటికి తీసుకువెళతానని చెప్పాడు. దాంతో సరేనని ఒప్పుకున్న ఆ యువతి ఇంటికి వెళిపోతుంది. ఆ తర్వాత రోజు నుంచి ఆ యువకుడు కనిపించడం మానేస్తాడు. ఈ అమ్మాయికి కడా గర్భం రావడంతో కంగారు పడి ఆ యువకుడి కోసం తన స్నేహితుల ద్వారా వెతకడం మొదలు పెట్టింది. ఇంతలు అతను ఒకరోజు కనిపించాడు అప్పుడు ఆమెకు అతని గురించి తెలిసిన నిజాలకు ఒక్కసారిగా షాక్ అయింది. అదేమిటంటే... అతనికి అప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దీంతో ఆమె ఆ యువకుడిని నిలదీసింది. తనని ఎందుకు మోసం చేశావంటూ అడిగింది.
దీంతో అతగాడు అతని నిజస్వరూపాన్ని బయట పెట్టాడు.పెళ్ళి చేసుకోవాలంటే పదిహేను లక్షలు తీసుకొస్తే చేసుకుంటానని చెప్పాడు. అంతేకాక ఆమెను నమ్మించి భోజనం పెట్టించి ఆమె తినే ఆహారంలో ఏదో మందు కలిపాడు. అది తినడంతో వెంటనే ఆమెకు అబార్షన్ అయిపోయింది. ఇక దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించి ఆ యువకుడి పై కేసు పెట్టింది. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.