ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ పేరు అందరికీ తెలిసిందే. గతంలో పవన్ కళ్యాణ్ మరియు పూనంకౌర్ వ్యవహారంపై తెలుగు మీడియా ఛానల్ లో దారుణమైన వ్యాఖ్యలు చేసి పెద్ద హాట్ టాపిక్ అయ్యాడు. అంతే కాకుండా అదే సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులకు చాలా పెద్ద టార్గెట్ కూడా అయ్యాడు. సోషల్ మీడియాలో మరియు ఎలక్ట్రానిక్ మీడియా లో కత్తి మహేష్ పేరు ఆ సమయంలో మారుమ్రోగిపోయింది. పవన్ కళ్యాణ్ గొడవతో బాగా హైలెట్ అయిన కత్తి మహేష్ అడపాదడపా సమాజంలో జరుగుతున్న వాటి గురించి మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఇటువంటి నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ నగరంలో రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించిన ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

 

ఈ సమావేశంలో కత్తి మహేష్ రాముడి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కత్తి మహేష్ ఏమన్నారంటే..రాముడు తన అంత:పురంలో ఉంపుడుగత్తెలతో సుఖించేవాడని - ఆయనకు నెమలి తొడ అంటే ఇష్టమని.. సీత జింకను వండుకుని తినడం కోసమే ఆయన్ని అడవిలోకి పంపిందని ఎగతాళిగా మాట్లాడాడు. అయితే రాజ్యాంగం పరిరక్షణకు సమావేశానికి హాజరయ్యి అన్ని మతాలని గౌరవించేది అని చెప్పే రాజ్యాంగానికి విరుద్ధంగా  కత్తి మహేష్ ఆ సమావేశంలో మాట్లాడటంతో అక్కడున్న మేధావులు వీడు కత్తి మహేష్ గాడు పెద్ద సుత్తి మహేష్ అన్నట్టు కామెంట్లు చేసుకున్నట్లు సమాచారం.

 

అసలే దేశంలో ప్రజల మధ్య మతకలహాలలో గొడవలు సృష్టించడానికి అల్లరి మూకలు అవకాశం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఇటువంటి సమావేశానికి ఇతన్ని ఎవరో పిలిచారని కొంతమంది మేధావులు అక్కడున్న వారు కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలకు మండిపడ్డారట. దేనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రావడంతో హైదరాబాద్ కు చెందిన ఉమేష్ కుమార్ అనే వ్యక్తి కత్తి మహేష్ మీద హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన పిటిషన్ లో కత్తి మహేష్ రాముడి పై చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో లింక్ కూడా జతచేసాడు. ఇదే తరుణంలో కొంత మంది సోషల్ మీడియాలో నెటిజన్లు కత్తి మహేష్ వ్యాఖ్యలకు తీవ్రస్థాయిలో సీరియస్ అవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: