ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు ఎక్కువయిపోతున్నాయి. పెళ్ళి భార్య, భర్తల బంధాలకి అర్ధం లేకుండా చేసేస్తున్నారు. అగ్నిసాక్షిగా పెళ్ళిళ్ళు చేసుకుని తిరిగి ఎవరికి వారికి తెలియకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. వీటివల్ల సంసారాలుకూలిపోవడమే కాకుండా భార్యాభర్తలిద్దరిలో ఎవరో ఒకరు ప్రాణాలు కూడా కోల్పోతున్న సందర్భాలు ఎన్నో అని చెప్పాలి. ఇలాంటి ఘటనే ఒకటి ఇటీవలె ఉత్తర్ ప్రదేశ్లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... ఉత్తర్ప్రదేశ్లోని మాఘర్ పట్టణానికి చెందిన మహిళకు భర్త, నలుగురు పిల్లలున్నారు. అయితే ఎంతో ఆనందంగా ఉన్న ఆ ఫ్యామిలీలోకి అనుకోకుండా మూడో వ్యక్తి ఎంటర్ అయ్యాడు ఎలాగంటే...కొద్దిరోజుల క్రితం ఆమె ఫోన్కు రాంగ్ కాల్ వచ్చింది. అదే ప్రాంతానికి చెందిన మౌల్వి(17) అనే బాలుడు ఆమెతో మాట్లాడాడు. ఇద్దరూ ఒకరికొకరు వివరాలు కనుక్కుని పరిచయం పెంచుకున్నారు. దీంతో ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. దీంతో ఓరోజు భర్త బయటకు వెళ్ళగానే ఫోన్ చేసి మరీ ప్రియుడ్ని పిలుపించుకుంది. దాంతో వీరిద్దరూ రాసలీలలు ఆడుతుండగానే భర్త వచ్చి తలుపు కడతాడు దీంతో భయపడిపోయిన వారిద్దరూ అక్కడి నుంచి వెంటనే ప్రియుడు మౌల్వి పారిపోయాడు. ఎంత సేపు తలుపు కొట్టినా తీయకపోవడంతో తలుపు గట్టిగా నెట్టాడు దాంతో మంచం మీద బట్టలు లేకుండా పడి ఉన్న భార్యను చూసి అనుమానం వచ్చింది.
అలాగే పారిపోతున్న మౌల్యాను చూసి గట్టి గట్టి అరుపులు అరవగా.. స్థానికులు వచ్చి దొంగ అనుకుని బాగా కొట్టి దేహ శుద్ధిని చేశారు. దీంతో భర్త భార్యను గట్టిగా నిలదీసి అడగగా అసలు విషయం బయట పెట్టింది. వెంటనే భర్త పోలీస్ కంప్లయింట్ ఇవ్వగా పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకుని బాలుడిని అరెస్ట్ చేసి ఆరా తీస్తున్నారు.