ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కిరసనాయిలుపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి రోజు ఏదొక విషయంపై స్పందించే విజయసాయి రెడ్డి, ఈరోజు స్పందిస్తూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. అంతర్జాతీయ మీడియాను మ్యానేజ్ చేసినోళ్లకు దేశీయ పత్రికలు ఒక లెక్కా అంటూ ప్రశ్నించారు విజయసాయి రెడ్డి.  

 

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. ''ఎకనమిక్ టైమ్స్ ఏదో రాసిందని కిరసనాయిలు తెగ మురిసిపోతున్నాడు. అంతర్జాతీయ మీడియాను మ్యానేజ్ చేసినోళ్లకు దేశీయ పత్రికలు ఒక లెక్కా. సంపాదించిన లక్షల కోట్లలో ఉల్లి పొరంత ఖర్చుపెడితే నిత్యం ఏదో కుట్రను ప్రచారంలో పెట్టొచ్చు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ సర్వైవల్ సీక్రెట్ ఇదే కదా!'' అంటూ ఫైర్ అయ్యారు విజయసాయి రెడ్డి. 

 

ఈ ట్విట్ చుసిన నెటిజన్లు.. సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.. కాగా విజయసాయి రెడ్డి ఈ మధ్యకాలంలో ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.. మొన్నటికి మొన్న కియా మోటార్స్ పై రాయిటర్స్ రాసిన కథనంను చంద్రబాబు నాయుడు రాయించారని ట్విట్స్ చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఈ నేపథ్యంలోనే ఈసారి ఎకనామిక్ టైమ్స్ ఏదో రాసింది అని.. అందుకు కిరసనాయిలు మురిసిపోతున్నాడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

ఈ వ్యాఖ్యలపై స్పందించిన కొందరు నెటిజన్లు.. చంద్రబాబు నాయుడుపై.. కిరసనాయిలుపై మండిపడ్డారు.. వారానికి ఓసారి వచ్చే ఈయన కొత్త పలుకులో కూడా చంద్రబాబుని ఆరాధ్య దైవంలా భావించి.. మిగతావారందరిని పిశాచులు చేస్తాడు సర్ ఈయన అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నెటిజన్లు. దీంతో ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: