ప్రేమ గుడ్డిది అంటారు.. నిజంగానే ఈ కథ చదివితే.. మీకు అలానే అనిపిస్తోంది. ఎంత ప్రేమించినా కూడా పరిమితికి మించి ప్రేమించకూడదు. అలా ప్రేమిస్తే ఈ కథ లాగే ఉంటుంది. మన కథ కూడా... గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని సర్దార్ నగర్ లో విషాదంగా, అనుమానంతో ముగిసింది ఓ ప్రేమ కథ..

 

 

మమతా మసి అనే ఓ హిజ్రా.. ఓ కుర్రాడితో ప్రేమలో పడింది. కొన్నాళ్ళు వీళ్ళు బాగానే  ఉన్నారు. ఏ గొడవలు లేకుండా ప్రేమగా.. ఉన్నారు. తర్వాత ప్రియుడికి వేరే ఎవరితోనే రిలేషన్‌షిప్ ఉందని ఆమె నమ్మింది. అదే ఆమెను ఈ లోకం నుంచీ తిరిగిరాని లోకాలకు పంపింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి చర్యలు చేపట్టారు.  

 

 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆమె నోబుల్ నగర్‌ లోని వాల్మీకి నగర్‌ లో నివసించేది. ఆమెను తన సొంత ప్రియుడే ఆయుధాలతో గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. మమతా మసి,  ఆమె ప్రియుడు అజయ్ నలియా.. మరో వ్యక్తి కలిసి వాల్మీకి నగర్‌లో ఓ అద్దె ఇంట్లో కొన్నాళ్లుగా ఉంటున్నారు. ఐతే కొన్ని నెలల తర్వాత మమతా మసి, అజయ్ మధ్య విబేధాలు వచ్చాయి. అజయ్ మరో హిజ్రాతో రిలేషన్‌షిప్ పెట్టుకున్నట్లుగా మమతా మసి అనుమానం పెంచుకుంది. దీనిపై ఇద్దరి మధ్యా కొన్నాళ్లుగా మాటల యుద్ధం జరుగుతోంది.

 

 

వారిద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. మమతా మసి అజయ్ ని అనుమనించడంతో.. నేను సంబంధం పెట్టుకోకపోయిన తనను అనుమానిస్తోందని ఫైర్ అయ్యాడు. ఒకప్పుడు ప్రేమగా మాట్లాడే నువ్వు.. ఇప్పుడు నాపై ప్రేమతో లేవు. అందుకే ఇంత కఠినంగా మాట్లాడుతున్నావు. అదే నచ్చిందిగా.. దాని దగ్గరకే పో" అంది. అంతే... అజయ్‌కి ఎక్కడ లేని కోపం వచ్చింది. గన్ బయటకు తీసి ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. అంతలోనే నేలకొరిగిన మమతా మసి... ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత అజయ్ పారిపోయాడు. పోలీసులకు అజయ్ దొరికితే కానీ అసలు విషయం బయటపడదని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: