ఒక తప్పు చేసి పోలీసులకు దొరికితే శిక్ష ఎప్పుడు పడుతుందో తెలియదు గాని కొంతమందికి మాత్రం వెంటనే ఆ భగవంతుడు శిక్షిస్తాడనే నమ్మకం చాలా మందికి ఉంటుంది. ఇక వారికి పడే శిక్షను చూసినప్పుడు మాత్రం భయంతో వొంట్లో వణుకు పుడుతుంది..

 

 

ఇంతకు విషయం ఏంటంటే సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక మహిళ తన పన్నెండేళ్ల కొడుకుతో కలిసి కర్ణాటక లోని బీదర్ కు వెళ్లి తెలంగాణ ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ కు బయలుదేరిన విషయం తెలిసిందే. అయితే ఆమెతో పాటుగా కొన్ని నిషేదిత వస్తువులను తీసుకుని వస్తుందన్న నెపంతో ఇద్దరు వ్యక్తులు ఆమెను భయపెట్టి బలవంతంగా జహీరాబాద్ పస్తాపూర్ చౌరస్తాలో దింపి ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళుతున్నట్లు మాయ మాటలు చెప్పి బలవంతంగా అత్యాచారానికి  పాల్పడ్డాడు.

 

 

ఈ విషయం ఉదయం స్థానికులు గమనించి, వారిని ప్రశ్నించగా జరిగింది చెప్పుకుని బావురుమన్న మహిళకు ధైర్యం చెబుతూ . వెంటనే పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ ఇవ్వమని చెప్పడంతో, బాధిత మహిళ అలాగే చేసింది.. ఇకపోతే ఆమె ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితుల ఆచూకీ వెతికేందుకు రంగంలోకి దిగారు. అయితే.. మహిళను బెదిరించి అత్యాచారం చేసిన నిందితులు పోలీసులు తమను పట్టుకుంటారన్న భయంతో వేగంగా కారును నడుపుకుంటు వెళ్లగా, ఆ కారు ప్రమాదానికి గురైంది..

 

 

ఈ ప్రమాదంలో ఒక నిందితుడు మరణించగా.. మరో నిందితుడ్ని.. అతడి వెంట ఉన్న ఇంకొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించినప్పుడు మహిళల్ని బెదిరింపులకు గురి చేసి వారిపై లైంగికంగా దాడి చేసే అలవాటున్న ముఠాగా వీరిని గుర్తించారు రక్షక భటులు.. ఈ దారుణమైన నిజాన్ని ఇన్నాళ్లు కప్పిపెట్టి వీరు చేస్తున్న అరాచకాలకు ఆ భగవంతుడే శిక్ష వేసాడని ఈ విషయం తెలిసిన కొందరు అనుకుంటున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: