వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడుని ప్రశ్నించారు.. ఎప్పుడు ప్రభుత్వంపై వచ్చే ఆరోపణలను.. తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడుని ప్రతిపక్ష నేత ఈ 9 నెలల్లో ఎం చేశాడు.. ఇదేనా అంటూ అయన ప్రశ్నలు వేశారు.  

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా చంద్రబాబుని ఇలా ప్రశ్నించారు.. ''ప్రతిపక్ష నేతగా 9 నెలల్లో చేసిందేమిటంటే... ఇసుక మాఫియాను రక్షించేందుకు ఇస్కో... ఉస్కో అంటూ శివాలూగాడు. ‘ఇన్ సైడర్’ భూముల కోసం ప్రభుత్వాన్నికూలుస్తా... తేలుస్తా అని గాల్లో కత్తులు తిప్పాడు. అవినీతి అధికారులకు కాపలాదారయ్యాడు. పొర్లు దండాలతో బొంగరంలా తిరగడమే మిగిలింది.'' అంటూ ట్విట్ చేశారు సాయి రెడ్డి. ఈ ట్విట్ చుసిన నెటిజన్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

9 నెలలు ప్రతిపక్షంలో ఉన్న అన్ని గాలి మాటలే మాట్లాడారని.. చేసింది ఏమి లేదు అని.. ఇసుక మాఫియాని రక్షించడానికి ఇస్కో ఉస్కో అన్నారు అని.. ఇప్పుడు ఇన్సైడర్ భూముల కోసం ప్రభుత్వాన్ని కూలుస్తా అంటున్నాడు అని .. బొంగరం తిరగడం తప్ప మిగిలింది ఏమి లేదు అంటూ ప్రశ్నిస్తూ ట్విట్ చేశారు. ఈ ట్విట్ చుసిన నెటిజన్లు.. కొందరు విజయసాయి రెడ్డిని తప్పు పడితే.. మరికొందరు విజయసాయి రెడ్డి వ్యతిరేకంగా ట్విట్స్ చేశారు. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: