విదేశానికి వలస వెళ్లిన భారతీయ పౌరులను ప్రవాస భారతీయులు అంటారు. ఒక ప్రాంతంలోని ప్రజలు సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాల వల్ల వలస పోతారు. జనాభా లెక్కల ప్రకారం ఒక మనిషి ఒక ప్రాంతంలో కొత్తగా నమోదు అయితే   ప్రవాసిగా లెక్కిస్తారు. దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతాలు దాటుకుంటూ చట్టపరంగానో, చట్ట విరుద్ధంగానో ఊపిరి మిగిలే చోటు కోసం తప్పని ప్రయాణం అవుతుంది. అయితే శాంతి సామరస్యాలకు కేరాఫ్ గా భారత దేశం నిలుస్తుంది. భిన్న మతాలు, భిన్న జాతుల మనుషులు కలిసిమెలిసి జీవించే దేశం భారత్. 

 

ఇండియా అంటే ఫారినర్స్ కూడా ఇష్టపడతారు. కానీ.. ఇప్పుడు ప‌రిస్థితులు అలా లేవ‌నే చెప్పాలి. భారతీయులు మారిపోతున్నారు. భారత్ వద్దు విదేశమే ముద్దు అంటున్నారు. అవును.. భారతీయులు దేశం వదిలి వెళ్లిపోతున్నారు. దీంతో విదేశాల్లో ప్రవాస భారతీయులు ఎక్కువ అవుతున్నారు. ఇక  ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో నివశిస్తున్న భారతీయుల వివరాలను సోమవారం లోక్‌సభలో విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లండించింది. మినిస్ట్రీ నివేదిక ప్రకారం మొత్తం 1.36 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో ఉంటున్నారు. ఇండియన్స్ అత్యధికంగా నివశిస్తున్న టాప్-10 దేశాల జాబితాలో యూఏఈ 34, 20, 000 మందితో మొదటి స్థానంలో ఉంది. 

 

ఆ తర్వాత‌ వరుసగా సౌదీ అరేబియా- 25,94,947, అమెరికా- 12,80,000, కువైట్- 10,29,861, ఒమన్- 7,79,351, ఖతార్- 7,56,062, నేపాల్- 5,00,000, బ్రిటన్- 3,51,000, సింగపూర్- 3,50,000, బహ్రెయిన్- 3,23,292 ఉన్నాయి. అలాగే 2015 నుంచి 2019 వరకు 125 దేశాల్లో సుమారు 21, 930 భారతీయులు మరణించగా.. వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఇదిలా ఉంటే.. భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) నివేదిక ప్రకారం విదేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులు 2018-19 వార్షికంలో మొత్తం 76.4 బిలియన్ డాలర్లు(రూ. 5.57 లక్షల కోట్లు) ఇండియాకు పంపించినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: