నిజంగానే ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్.. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఆదాయపు పన్నుశాఖ వలలో ఓ తిమింగళమే పడింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 2000 కోట్ల రూపాయల నల్లధనం వివరాలు ఆదాయపు పన్ను శాఖ చేతికి చిక్కాయి. ఈ నెల ఆరున దేశ వ్యాప్తంగా 40 ప్రాంతాల్లో చేసిన సోదాల్లో ఈ వివరాలు వెలుగు చూసినట్టు తెలుస్తోంది.



ఈ తనిఖీల్లో దాదాపు రెండు వేల కోట్లకుపైగా అనధికారిక లెక్కలను ఐటీ శాఖ గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ నెల ఆరున దేశ వ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఐటీ శాఖ సోదాలు చేసింది. ఈ సోదాల్లో రెండు వేల కోట్లకుపైగా అనధికారిక లెక్కలను గుర్తించింది. ఈ తనిఖీలు ఎక్కడెక్కడ జరిగాయంటే.. కడప, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, దిల్లీ, పూణెలతోపాటు మరో 40 ప్రాంతాల్లో సోదాలు జరిగినట్టు తెలుస్తోంది.



ఈ సోదాల్లో రూ.85లక్షలు నగదు కూడా దొరికిందట. అంతే కాకుండా 71లక్షలు విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారట. 25కుపైగా బ్యాంకు లాకర్లను ఆదాయపు పన్నుశాఖ అధికారులు తమ ఆదీనంలోకి తీసుకున్నట్టు ఆదాయపు పన్ను శాఖ వర్గాల సమాచారం. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని మూడు ప్రముఖ ఇన్‌ఫ్రాస్టక్చర్ గ్రూపులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు జరిపినట్టు సమాచారం.



గతంలో చంద్రబాబు వద్ద పీఎస్ గా పనిచేసిన శ్రీనివాస చౌదరికి చెందిన నివాసాలు, ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ తనిఖీలు జరిగినట్టు తెలుస్తోంది. బోగస్‌ సబ్ కాంట్రాక్టర్లు, నకిలీ బిల్లులు ద్వారా భారీగా నగదు చెలామణి చేస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. అసలే రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్న చంద్రబాబుకు ఇది మరో శరాఘాతం అయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: