భార్యా భర్తల బంధం మధ్య సెక్స్ అనేది చాలా కీలక పాత్రను పోషిస్తది. అయితే ఇందులో కొంత మందికి ఇంట్రస్ట్ ఉంటది. మరి కొంత మందికి ఉండదు. ముఖ్యంగా చాలా మంది ఆడవారు పెద్దగా ఇష్టం చూపించరు. దాంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. దాంతో కొంత మంది కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాకాకుండా భర్త భార్యను నెమ్మదిగా తన దారికి తెచ్చుకోవడం. ప్రేమగా మాట్లాడటం. ఆ విషయం పై అవగాహన తీసుకురావడం ఇలాంటివి ఉంటే ఆ సంసార జీవితం సుఖంగా సాగుతుంది. ఒకరొ నొకరు తెలుసుకుని ఒకరి మనసును మరొకరు నొప్పించకుండా ముందుకు సాగితేనే ఏదైన కలకాలం ఏ ఇబ్బందులు లేకుండా ఉంటుంది. పెద్దలు కుదిర్చిన వివాహమైన, ప్రేమించి పెళ్ళి చేసుకున్నా భార్యా భర్తల బంధమనేది చాలా విలువైంది. అది మన ప్రవర్తన బట్టే ఉంటుంది. దానికోసం మనం సర్దుకుపోవాలి తప్పించి ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని పాడుచేసుకోకూడదు. ఇటీవలె ఇలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ గ్రామానికి చెందిన హసన్ అనే వ్యక్తికి కొంతకాలం క్రితం వివాహమైంది. స్వగ్రామం యూపీలో ఉన్నా.. ఉద్యోగం గుజరాత్ లో చేసేవాడు.దీంతో భార్యను స్వగ్రామంలో ఉంచి.. విధుల నిర్వహణకు వెళ్లిపోయాడు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు. ఇటీవల హసన్ ఉద్యోగానికి సెలవు పెట్టి ఇంటికి వచ్చాడు. కాని ఇంటికి వచ్చిన భర్తతో భార్య సరిగా ఉండడం లేదు. అంతగా ఏ విషయంలోనూ ఇంట్రస్ట్ చూపించడం లేదు. రాత్రి అయ్యే సరికి అతను శృంగారంలో పాల్గొందాం అన్నా కూడా ఆమె పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీంతో సహనాన్ని కోల్పోయిన హసన్ కోపంతో రగలిపోయి కత్తితో పొడిచి భార్యను హతమార్చాడు. తీవ్ర రక్తస్రావం అయ్యి.. ఆమె అక్కడికక్కడే కన్నుమూసింది.
దాంతో కంగారు పడిపోయిన భర్త ఏం చేయాలో కూడా అర్ధం కాక అదే కత్తితో తన మర్మాంగాలను కోసేసుకున్నాడు. ఇక వీరిద్దరి ఆర్తనాదాలు విన్న స్థానికులు పరుగున రాగా... ఇద్దరూ రక్తపుమడుగులో పడి ఉన్నారు. ఇద్దరినీ వెంటనే హాస్పటల్కి తరలించగా భార్య చనిపోయిందని వైధ్యులు నిర్ధారించారు. భర్తకు వైద్యం అందిస్తున్నారు. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు కేసు పెట్టగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.