ఈమధ్య సెల్ఫీ ల గోల ఎక్కడపడితే అక్కడ బాగా ఎక్కువ అయిపోతుంది. మామూలుగానే స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది అంటే సెల్ఫీలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే సెల్ఫీల పిచ్చి ఎక్కువగా ఉన్న వారికి ఎవరైనా  సెలబ్రిటీలు కనిపించారు అంటే ఇక అంతే వారితో ఎలాగైనా సెల్ఫీ తీసుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కనిపించినప్పుడు వారితో సెల్ఫీలు తీసుకునేందుకు తెగ ఆసక్తి చూపుతుంటారు చాలా మంది జనాలు. ఇక అభిమానులు సెల్ఫీలు అడుగుతున్నారు కదా అని ఎంతో ఓపికగా సెల్ఫీలు ఇచ్చేందుకు సిద్ధమవుతుంటారు సెలెబ్రిటీ లు . అయితే కొంతమంది కేటుగాళ్లు మాత్రం సెల్ఫీల పేరుతో గుంపులో గోవిందా అన్నట్లుగా అందినకాడికి దోచుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు చాలా మంది సెలబ్రిటీలకు ఎదురయ్యే ఉంటాయి. 

 

 

 సెల్ఫీ కావాలి అంటూ  గుంపులో ఒకరిగా రావడం సెల్ఫీ తీసుకునే నెపంతో ఏదో ఒకటి దోచుకెళ్లటం  లాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ తెలంగాణ మంత్రి కి అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. సెల్ఫీలు తీసుకునేందుకు ఎక్కువమంది అభిమానులు రావడంతో ఎంతో ఓపిక సెల్ఫీలు ఇచ్చారు తెలంగాణ మంత్రి. ఇక సెల్పులు పూర్తయిన తర్వాత చూసుకొని షాక్ కి గురయ్యారు. ఎందుకంటే ఆ మంత్రి చేతికున్న బంగారు కడియం  పోయింది. పక్కనే బాడీగార్డులు ఉన్నప్పటికీ కూడా ఆ దొంగ బాగా ధైర్యం చేసి బంగారు కడియాన్ని  ఎత్తుకెళ్లాడు. వివరాల్లోకి వెళితే.. అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన చేతి బంగారు కడియం పోగొట్టుకున్నారు. మహబూబ్నగర్లోని దేవరకద్ర లో నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. 

 

 

 స్థానికంగా జరిగిన ఓ వివాహానికి హాజరయ్యారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇక అక్కడికి వచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపారు. ఈ క్రమంలోనే చాలామంది సెల్ఫీ కోసం మంత్రి  వద్దకు వచ్చి క్యూ కట్టారు. అయితే అభిమానులను నిరాశ పరచడం ఇష్టంలేని మంత్రి శ్రీనివాస్ గౌడ్... వారితో ఓపిగ్గా సెల్ఫీ దిగారు. ఇక ఆ తర్వాత మంత్రి ఖంగుతిన్నాడు. ఎందుకంటే ఆయన చేతికి ఉండాల్సిన బంగారు కడియం మాయమైనది. ఈ ఘటనతో మంత్రి విస్తుపోయాడు అనే చెప్పాలి. విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగారు. ఆ కడియం మంత్రికి సెంటిమెంట్ కావడంతో ఎవరైనా తీసి ఉంటే ఇచ్చెయ్యాలి  అంటూ పోలీసులు బ్రతిమాలటం  కనిపించింది అక్కడ.

మరింత సమాచారం తెలుసుకోండి: