అతను ఇది వారికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ఇప్పుడు మళ్ళి పెళ్లి కొడుకు అయ్యాడు. మూడో పెళ్లి చేసుకోడానికి సిద్ధంగా ఉన్నాడు.. పెళ్ళిపీఠాలు ఎక్కడో లేదో అక్కడికి అతని మొదటి భార్య వచ్చింది. ఇంకా అంతే.. ఆ మండపం అంత కామెడీ అయిపోయింది. ఆ పెళ్ళికొడుకుని పట్టుకొని.. ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటావ్ రా.. ని అబ్బా అంటూ పెళ్లి బట్టలు చినిగిపోయేలా కొట్టింది.. 

 

ఇప్పటికే నీకు ఇద్దరు భార్యలు ఉన్నారు మళ్లీ మూడో పెళ్లి కావాలా రా ? నీకు ? సాలే నాకొడుకా అంటూ బూతులు తిడుతూ అతన్ని తరిమి తరిమి కొట్టింది.. ఈ ఘటన పాకిస్థాన్ లోని కరాచిలోని సఖి హసన్ చౌరంగి ప్రాంతంలో జరిగింది. కరాచిలోని నార్త్ నిజామాబాద్ లోని షాదీ మహల్ లో ఆసీఫ్ రఫీక్ అనే వ్యక్తి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. 

 

వధువు బంధువులు.. వరుడు బంధువులతో ఇద్దరు కలిసి ఫోటోలు దిగుతున్నారు. కరెక్ట్ గా ఫోటోకు పోజులు ఇచ్చాడో లేదో మొదటి భార్య వచ్చి అతనిపై శివతాండవం చేసింది. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్న నవ వరుడు ఆసీఫ్ రఫీక్ 2014లోనే మాదిహ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆతర్వాత 2018లో ఆమెను ఒప్పించి రెండో పెళ్లి చేసుకున్నాడు. 

 

అయితే రెండో పెళ్లి చేసుకున్న ఆమెతోనే ఉంటా అన్నాడు అని.. కానీ ఆమెతోను లేకుండా.. తనతోను లేకుండా ఇప్పుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోడానికి సిద్ధం అయ్యాడు అని ఆమె పేర్కొంది. కానీ భర్త మాత్రం ఆమెకు విడాకులు ఇచ్చానని.. విడాకులు ఇచ్చాక ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్న ఆమెకు అనవసరం అని చెప్పుకొచ్చాడు. 

 

అంతేకాదు భార్య భర్తల ఇద్దరిపై కేసు నమోదు అయ్యింది. ఆమెతో పాటు రెండో భార్యను మోసం చేసిన భర్త ఆసీఫ్ రఫీక్ మీద చర్యలు తీసుకోవాలని మొదటి భార్య మాదిహా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా అతను పెళ్లి చేసుకుంటుంటే పెళ్లిమండపంలో అతన్ని కొట్టి పెళ్లి ఆగిపోవడానికి కారణమైన భార్యపై పోలీసులకు పిర్యాదు చేశాడు. దీంతో ప్రస్తుతం భార్య భర్తలు ఇద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: