భార్య భవాని కళ్లు గప్పి భర్త సతీశ్ మరో యువతితో పరిగి టీచర్స్ కాలనీలో సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య పోలీసులకు వారిద్దరిని రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టించింది. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... పరిగికి చెందిన సతీశ్‌ నే వ్యక్తికి కొన్నాళ్ల కిందట ఖమ్మం‌కు చెందిన భవానీ తో వివాహమైంది. కొన్నాళ్ల పాటు సాఫీగానే సాగిన వీరి కాపురంలో ఓ యువతి ప్రవేశించడంతో కలహాలు మొదలయ్యాయి. 

 

 

కాగా., భార్య తనను పట్టించుకోకుండా ఉంటున్నాడు. మొదటగా ఈ విషయ మై సతీశ్ భార్య పెట్టించుకొలేదు. కానీ.. క్రమ క్రమంగా తనను పట్టించుకోకుండా ఉండటంతో, దూరం పెరగటంతో భవానికి అనుమానం మొదలు అయింది. ఈ విషయ మై భవాని తన భర్తను ఎన్ని సార్లు అడిగినా నోరు విప్పలేదు. సతీశ్ తో విసిగిపోయిన భవాని విషయాన్ని తెలుసుకుంది. తన భర్త మరో యువతితో సహజీవనం చేస్తున్నాడని తెలుసుకున్న మహిళ అతడిని రెడ్‌ హ్యాండెడ్‌ గా పోలీసులకు పట్టించింది.

 

 

అంతటితో భవాని ఆగకుండా తన భర్తను వలలో వేసుకున్న యువతిని పోలీసుల ముందే చితకబాదింది. నా భర్తను నాకు కాకుండా చేశావని ఆవేదన చెంది ఆమెను చితకొట్టింది. సతీశ్‌ ప్రియురాలితో పరిగి టీచర్స్ కాలనీలో సహజీవనం చేస్తున్న సంగతి తెలుసుకున్న భవానీ గురువారం డయల్ 100కి ఫోన్ చేసి వారిద్దరిని పోలీసులకు పట్టించింది. 

 

 

తన కాపురాన్ని నాశనం చేశావంటూ భవానీ ఆ యువతిని పోలీసులు ఎదుట చితకబాదింది. యువతిని ఆమె బారి నుంచి కాపాడిన పోలీసులు అందరినీ పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. భవానీ స్టేషన్ ఎదుట బైఠాయించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: